తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటి శ్రీలక్ష్మి గురించి మనకు తెలిసిందే. గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలో నటించిన శ్రీ లక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె ఇండస్ట్రీలోకి రావడానికి గల కారణం ఏంటి అనే విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
నటి శ్రీలక్ష్మి తండ్రి అమర్ నాథ్ అతను కూడా వృత్తిపరంగా నటుడే.హైదరాబాద్లో నివసించే శ్రీలక్ష్మి కుటుంబం తన తండ్రి మరణం తర్వాత కుటుంబ పోషణ కోసం హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లారు. అయితే అక్కడ ఓ ఇంటిలో అద్దెకు ఉండే వారు.శ్రీలక్ష్మి అద్దెకు ఉన్న ఇల్లు తన తండ్రి స్నేహితుడు హీరో భానుచందర్ తండ్రి సంగీత దర్శకుడు వేణు మాస్టర్. అయితే వీరిద్దరు ఫ్రెండ్స్ అన్న విషయం వారికి తెలియదు. కొద్ది రోజుల తర్వాత తన స్నేహితుడు పిల్లలను తెలుసుకున్నారు.
ఈ క్రమంలోనే శ్రీ లక్ష్మి సోదరుడు రాజేష్ నెలవంక సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలో రెండు జెళ్ళ సీత అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో సుత్తివేలు భార్యగా శ్రీ లక్ష్మి ఓ చిన్న పాత్రలో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే రాజేష్ తన అక్క సినిమాలలో నటించడం ఇష్టం లేదని, తనని సినిమాలలో నటించవద్దని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్లాల్సిందిగా తనతో గొడవపడ్డారు.అప్పుడు శ్రీలక్ష్మి కుటుంబ పోషణ జరగాలంటే ప్రతి ఒక్కరు సంపాదించాలని ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.
ఈ విధంగా పలు సినిమాలలో చేసిన శ్రీలక్ష్మి సోదరుడు రాజేష్ ఓ ప్రమాదంలో మృతి చెందాడు.ఈ క్రమంలోనే రాజేష్ వారసురాలిగా ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ పలు సినిమాలలో నటిస్తున్నారు. ఈ విధంగా శ్రీ లక్ష్మి సినిమాలలోకి రావడానికి గల కారణాన్ని ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…