తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటి శ్రీలక్ష్మి గురించి మనకు తెలిసిందే. గత కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలో నటించిన శ్రీ లక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె ఇండస్ట్రీలోకి రావడానికి గల కారణం ఏంటి అనే విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
నటి శ్రీలక్ష్మి తండ్రి అమర్ నాథ్ అతను కూడా వృత్తిపరంగా నటుడే.హైదరాబాద్లో నివసించే శ్రీలక్ష్మి కుటుంబం తన తండ్రి మరణం తర్వాత కుటుంబ పోషణ కోసం హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లారు. అయితే అక్కడ ఓ ఇంటిలో అద్దెకు ఉండే వారు.శ్రీలక్ష్మి అద్దెకు ఉన్న ఇల్లు తన తండ్రి స్నేహితుడు హీరో భానుచందర్ తండ్రి సంగీత దర్శకుడు వేణు మాస్టర్. అయితే వీరిద్దరు ఫ్రెండ్స్ అన్న విషయం వారికి తెలియదు. కొద్ది రోజుల తర్వాత తన స్నేహితుడు పిల్లలను తెలుసుకున్నారు.
ఈ క్రమంలోనే శ్రీ లక్ష్మి సోదరుడు రాజేష్ నెలవంక సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలో రెండు జెళ్ళ సీత అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో సుత్తివేలు భార్యగా శ్రీ లక్ష్మి ఓ చిన్న పాత్రలో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే రాజేష్ తన అక్క సినిమాలలో నటించడం ఇష్టం లేదని, తనని సినిమాలలో నటించవద్దని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్లాల్సిందిగా తనతో గొడవపడ్డారు.అప్పుడు శ్రీలక్ష్మి కుటుంబ పోషణ జరగాలంటే ప్రతి ఒక్కరు సంపాదించాలని ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.
ఈ విధంగా పలు సినిమాలలో చేసిన శ్రీలక్ష్మి సోదరుడు రాజేష్ ఓ ప్రమాదంలో మృతి చెందాడు.ఈ క్రమంలోనే రాజేష్ వారసురాలిగా ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ పలు సినిమాలలో నటిస్తున్నారు. ఈ విధంగా శ్రీ లక్ష్మి సినిమాలలోకి రావడానికి గల కారణాన్ని ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…