Actor Subbaraya Sharma : నాటకరంగం నుండి సినిమాల్లోకి ఎందరో నటులు వచ్చారు. అలా నాటక రంగం నుండి సినిమాల్లో నటిస్తూ అలానే రేడియో రంగాలలోనూ నాటికల ద్వారా పరిచయమై అలాగే బుల్లితెర మీద కూడా నటిస్తున్న వ్యక్తి ఉప్పలరి సుబ్బరాయశర్మ. నాలుగు రంగాల్లోనూ పనిచేస్తూ అలాగే ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఆయన 200 పైగా సినిమాల్లో నటించారు. ఇక సినిమాల్లోనే కాకుండా చిన్నతనం నుండే నాటకాలలో నటించిన ఆయన ఎల్ బి శ్రీరామ్ గారి ‘ఒంటెద్దు బండి’ నాటకాన్ని వందసార్లు ప్రదర్శించి మెప్పించారు. ఇక నాటకాలకు ఆయన ఎన్నో అవార్డులు ఇక సీరియల్స్ లో నటనకు నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.
బాబు మోహన్ కోటా కి మధ్య గొడవలు…
అప్పట్లో అందరు కమెడియన్స్ కి పని దొరికేదని, అన్ని సినిమాల్లోనూ కమెడియన్స్ బాగా ఉండేవారంటూ చెప్పిన సుబ్బరాయ శర్మ గారు తాను సినిమాల మీదే దృష్టి సారించకపోవడం వల్ల ఇంకా ఎక్కువ సినిమాలను చేయలేక పోయానంటూ చెప్పారు. ఇక అప్పట్లో బ్రహ్మానందంతో గొడవ పడి ఏవిఎస్ 20 మంది కమెడియన్స్ తో కలిసి మీటింగ్ పెట్టాడు. కానీ ఆ తరువాత తానే బ్రహ్మానందంతో కలిసి నటించాడు కదా అలా ఏవో క్లాషెస్ ఉన్నా కూడా సినిమాలలో కలిసి నటించేవారుంటూ చెప్పారు. అలానే బాబూమోహన్ కోటా కి చిన్న డిఫరెన్స్ వచ్చింది. అప్పట్లో ఇద్దరి కాంబినేషన్ మంచి హిట్ కాబట్టి చాలా సినిమాలు కలిసి చేసారు. అలా చేస్తున్నపుడు ఇగో క్లాషెస్ కామన్, అలా గొడవ వచ్చినా మళ్ళీ అవే సర్దుకున్నాయి. వాళ్లిద్దరూ కలిసి మళ్ళీ నటించారు అంటూ చెప్పారు.
ఎన్టీఆర్ నాతో అరగంట మాట్లాడారు…
సినిమాల్లో అందరితో నటించినా సీనియర్ ఎన్టీఆర్ గారితో నటించలేదనే కొరత ఉండిపోయింది అంటూ సుబ్బరాయ శర్మ తెలిపారు. మొదట్నుంచి అయిన నా అభిమాన నటుడు అంటూ చెప్పారు. అయితే ఆయన విశ్వామిత్ర సినిమాను ఆయనే డైరెక్ట్ చేయాలనుకున్నపుడు నన్ను ఇంటికి రమ్మని పిలిపించారు. వెళితే అరగంట సేపు నాతో మాట్లాడి టీవీ రంగం ఎలా ఉందని అడిగి అలానే నా స్వస్థలం, వ్యక్తిగత వివరాలను అడిగి దాదాపు అరగంట నాతో మాట్లాడారు, అది చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పారు. అయితే ఆ సినిమాలో నన్ను తీసుకోలేదు నేను ఆయన అనుకున్న పాత్రకు నచ్చనని అనుకున్నారేమో కానీ ఆయనతో ఆ అరగంట మాట్లాడటమే నా అదృష్టంగా భావిస్తాను అంటూ ఆయన అభిమానాన్ని చెప్పారు సుబ్బరాయ శర్మ.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…