Vadde Naveen: బిగ్ బాస్ 6 లోకి ఎంట్రీ ఇవ్వనున్న నటుడు వడ్డే నవీన్.. ఈ వార్తలలో నిజమెంత?
Vadde Naveen: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివిధ భాషలలో ప్రసారమౌతున్న ఈ కార్యక్రమం అన్ని భాషల్లోనూ కొన్ని సీజన్లను పూర్తిచేసుకుని ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుని. తెలుగులో కూడా 5 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఆరో సీజన్ ప్రసారం కావడానికి సిద్దమవుతోంది.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఇకపోతే ఈ కార్యక్రమంలో పలువురు స్టార్ సెలబ్రెటీలు పాల్గొంటున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి వార్తలు వస్తున్నాయి. అయితే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలోకి ఒకప్పటి స్టార్ హీరో వడ్డే నవీన్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.
ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పెళ్లి, మనసిచ్చి చూడు, చెప్పాలని ఉంది వంటి సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. అయితే ఈయన ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఈ విధంగా ఇండస్ట్రీకి దూరమైన వడ్డే నవీన్ ప్రస్తుతం పలు వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.
చాలా కాలంగా వెండి తెరకు దూరమైనా వడ్డే నవీన్ తిరిగి బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షోలో సందడి చేయనున్నారని తెలియడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈయన కనక ఈ కార్యక్రమంలో పాల్గొంటే బిగ్ బాస్ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటారు. మరి వడ్డే నవీన్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…