జెమినీ గణేషన్ మొదటి భార్య పుష్పవల్లి కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా నటించేవారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు జన్మించగా వారిద్దరు కూడా సినిమా రంగంలో అరంగేట్రం చేశారు. ఆ కుమార్తెల పేర్లు భాను రేఖా గణేషన్, రాధా కాగా… భానురేఖ 180 హిందీ సినిమాల్లో నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. రాధా కొన్నేళ్ల పాటు తమిళ సినిమాల్లో నటించి ఆ తర్వాత పెళ్లి చేసుకొని అమెరికా కు శాశ్వతంగా వెళ్లిపోయింది. భాను రేఖా గణేషన్ కామసూత్ర సినిమాలో నటించి ప్రేక్షకులకు సెగలు పుట్టించిందని చెప్పుకోవచ్చు.
మొన్నీమధ్య ఏఎన్నార్ పురస్కారం కూడా అందుకుంది. అయితే ఈమెకు సావిత్రి పిన్ని అవుతుంది. అప్పట్లో సావిత్రి భానురేఖను మంచిగానే చూసుకునేది కానీ రాధకు మాత్రం సావిత్రి అంటే అంత కష్టం ఉండక పోయేది. ఒకానొక సమయంలో సావిత్రి బంగారపు పెట్టేలా మెరిసే ఒక పర్సనల్ పెట్టెను తయారు చేపించి దాన్ని షో చేస్తూ తనవెంటే తీసుకెళ్లేది. అయితే ఒకరోజు ఈ బంగారుపెట్టె లాగా మెరిసే దాన్ని చూసిన భాను రేఖ నాకు అది కావాలని మారాం చేస్తే… అచ్చం అలాంటి పెట్టనే సావిత్రి స్పెషల్ గా తయారు చేయించి భాను రేఖా కు ఇచ్చింది.
జెమినీ గణేషన్ కి లెక్కలేని ఎఫైర్స్, నలుగురు పెళ్ళాలు ఉన్నారు. పుష్పవల్లి అతనికి రెండో భార్య. మొదటి భార్యతో సంసారం చేసి నలుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు జెమినీ గణేషన్. సావిత్రిని పెళ్లి చేసుకున్నాక వారిద్దరికీ విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్ జన్మించారు. మొత్తం ఎనిమిది మంది పిల్లలు ఉండగా… ఎవరిని ప్రేమగా చూసుకోవాలి అని జెమినీ గణేషన్ కి అర్థం కాక పోయేది. ఒకరికి ఏదైనా బంగారం నాకు కొనేస్తే… అందరికీ కొనించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే జెమినీ గణేషన్ తన పిల్లలందరినీ తో కొంత సమయం గడుపుతూ…. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయో ప్రతిక్షణం పరీక్షించుకోవాలి. చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదు. మన దుఃఖానికి మనమే కారణం అవుతాము అది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుందని తన పిల్లలకు చెబుతుండేవాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…