Actress Hema: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి హేమ ఒకరు.ఈమె ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో యంగ్ హీరో హీరోయిన్లకు అక్క పిన్ని వదిన పాత్రలలో నటిస్తూ సందడి చేశారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు.
ఇకపోతే సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా నటి హేమ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి పలువురుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఇలా ఈమె ఎవరిపై ఫిర్యాదు చేసింది ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
గత కొద్ది రోజుల క్రితం హేమ తన పెళ్లి రోజును జరుపుకున్నారు. ఇలా తన పెళ్లి రోజు వేడుకలలో భాగంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు వచ్చారు. అయితే ఈ దంపతులు స్విమ్మింగ్ పూల్ లో కేక్ కట్ చేస్తూ ఒకరికొకరు లిప్ లాక్ పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోలపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విభిన్నమైన థంబ్ నెయిల్స్ పెడుతూ తమ పరువుకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇలా తమ పరువు తీసినటువంటి సదరు యూట్యూబ్ ఛానల్ లపై యాక్షన్ తీసుకోవాలంటూ ఈమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత చాలామంది తమ ఛానల్ కు మంచి ఆదరణ రావాలన్న ఉద్దేశంతో ఇలా విభిన్నమైన థంబ్ నెయిల్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఇవి వారికి ఎంతో ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు సదురు చానల్ పై చర్యలకు కూడా సిద్ధమవుతూ ఉంటారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…