Connect with us

Featured

Actress Hema: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి హేమ… వారిపై ఫిర్యాదు చేసిన నటి!

Published

on

Actress Hema: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి హేమ ఒకరు.ఈమె ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో యంగ్ హీరో హీరోయిన్లకు అక్క పిన్ని వదిన పాత్రలలో నటిస్తూ సందడి చేశారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు.

ఇకపోతే సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా నటి హేమ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి పలువురుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఇలా ఈమె ఎవరిపై ఫిర్యాదు చేసింది ఫిర్యాదు చేయడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

గత కొద్ది రోజుల క్రితం హేమ తన పెళ్లి రోజును జరుపుకున్నారు. ఇలా తన పెళ్లి రోజు వేడుకలలో భాగంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు వచ్చారు. అయితే ఈ దంపతులు స్విమ్మింగ్ పూల్ లో కేక్ కట్ చేస్తూ ఒకరికొకరు లిప్ లాక్ పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోలపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విభిన్నమైన థంబ్ నెయిల్స్ పెడుతూ తమ పరువుకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Actress Hema: యూట్యూబ్ ఛానల్ పై ఫిర్యాదు చేసిన నటి…

ఇలా తమ పరువు తీసినటువంటి సదరు యూట్యూబ్ ఛానల్ లపై యాక్షన్ తీసుకోవాలంటూ ఈమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత చాలామంది తమ ఛానల్ కు మంచి ఆదరణ రావాలన్న ఉద్దేశంతో ఇలా విభిన్నమైన థంబ్ నెయిల్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఇవి వారికి ఎంతో ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు సదురు చానల్ పై చర్యలకు కూడా సిద్ధమవుతూ ఉంటారు.

Featured

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రీ రిలీజ్… ఎన్నికల మైలేజ్ కోసమే ప్రయత్నమా?

Published

on

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను నటిస్తున్న సినిమాలన్నింటికీ కాస్త విరామం ప్రకటించి రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం జనసేన అధినేతగా ఈయన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఇప్పటికే నామినేషన్ కూడా వేసినటువంటి పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఇలా పవన్ కళ్యాణ్ కోసం పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలో బుల్లితెర నటీనటులు అలాగే జబర్దస్త్ కమెడియన్లు కూడా రంగంలోకి దిగి ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఇలా త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాని తిరిగి విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

అన్యాయంగా ఒక కేసులో ఎరుకొని శిక్ష అనుభవించడానికి సిద్ధమవుతున్నటువంటి ముగ్గురు అమ్మాయిలకు శిక్ష పడుతున్నటువంటి తరుణంలో హీరో వారిని ఎలా కాపాడారు అన్న నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది 2021 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

Advertisement

ఎన్నికల మైలేజ్..
ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో తాజాగా ఈ సినిమాని తిరిగి విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. మే 1వ తేదీ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమా తిరిగి విడుదల కాబోతోంది అయితే ఈ సినిమాని ఇప్పుడు విడుదల చేయడం వెనుక భారీ వ్యూహం ఉందని తెలుస్తుంది త్వరలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ మైలేజ్ కోసమే ఈ సినిమాని విడుదల చేస్తున్నారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ప్రయోజనకరంగా మారుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: ఆకీరా ఆద్య మెగా వారసులు కారా.. ఇంటి పేరును మార్చేసిన పవన్ కళ్యాణ్!

Published

on

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే జనసేన పార్టీని స్థాపించినటువంటి ఈయన ప్రస్తుతం పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నికలలో పోటీ చేయబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇటీవల నామినేషన్ కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఎన్నికల అఫిడవిట్ లో భాగంగా వారి పూర్తి సమాచారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత విషయాలను గురించి తెలియజేస్తూ తన పిల్లల పేర్లను మార్చేశారు. దీంతో ఈ విషయం కాస్తా సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ సినీ నటి రేణు దేశాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా మారారు అయితే పిల్లలు జన్మించిన తర్వాత రేణు దేశాయ్ కి విడాకులు ఇవ్వడంతో పిల్లలు కూడా తన తల్లి వద్దే ఉంటున్నారు.

ఇలా రేణు దేశాయ్ ఈ కుటుంబం నుంచి దూరంగా ఉన్నప్పటికీ తన పిల్లలను మాత్రం ఎప్పటికప్పుడు మెగా కుటుంబానికి దగ్గర చేస్తున్నారు మెగా కుటుంబంలో జరిగే ఈవెంట్లకు వీళ్ళ హాజరవుతున్నారు. ఇక అకీరా ఆద్య ఇద్దరిని కూడా మెగా వారసులుగానే భావిస్తూ ఉంటారు.

Advertisement

ఇంటిపేరు మార్చిన పవన్..
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మాత్రం వీరి ఇంటి పేరులను మార్చుతూ ఎన్నికల అఫీడవిట్లో పేర్కొనడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. తన పిల్లల పేర్ల గురించి పవన్ కళ్యాణ్ రాస్తూ కొణిదెల అకీరా నందన్ అని కాకుండా అకీరా దేశాయ్ ఆధ్యా దేశాయ్ అని రాసుకొచ్చారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు ఇలా పిల్లల పేర్లను మార్చడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

YS Jagan: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన వైయస్ జగన్.. నవరత్నాలకే పెద్ద పీఠ!

Published

on

YS Jagan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మే 13వ తేదీ జరగబోతున్నటువంటి తరుణంలో అందరి ఆసక్తి ఈ ఎన్నికల ఫలితాలపైనే ఉంది జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో ఎంతో మంచి సక్సెస్ అయ్యారు ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ కూడా సూపర్ సిక్స్ అంటూ ఉచిత హామీ పథకాలను అమలులోకి తీసుకు వస్తామని తెలిపారు. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని వైసీపీ క్యాంప్ ఆఫీస్ లో ఈ మేనిఫెస్టో విడుదల చేశారు.ఏపీలో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని అన్నారు. మ్యానిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించామని అన్నారు. గత ఎన్నికలలో విడుదల చేసిన మేనిఫెస్టో ద్వారా నవరత్నాలు 99 శాతం అమలు అయ్యాయని ఈ నవరత్నాల ద్వారా ఎంత మంది ఎన్ని విధాలుగా లబ్ధి పొందారు అనే విషయాలన్నింటినీ జగన్ వివరించారు.

ఇక ఈ మేనిఫెస్టోలో కూడా అవే నవరత్నాలను కొనసాగిస్తున్నట్టు తెలిపారు. అయితే నవరత్నాలలో భాగంగా ప్రస్తుతం ఇచ్చే నగదును మరింత పెంచుతూ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు పింఛన్లు 3000 నుంచి 3500 వరకు పెంచారు. ఆరోగ్యశ్రీని కొనసాగిస్తున్నట్లు తెలిపారు రైతు భరోసాన్ని 16,000 చేశారు. అమ్మఒడి 17 వేలకు పెంచారు. వైయస్సార్ ఈ బీసీ నేస్తం 45000 నుంచి 1.5 లక్షలకు పెంపొందించారు.

Advertisement

నవరత్నాలకే ప్రాధాన్యత..
వైయస్సార్ సున్నా వడ్డీ కింద మూడు లక్షల వడ్డీ లేని రుణాలు అందించారు వాహన మిత్ర కొనసాగించారు అయితే ఈసారి టిప్పర్ డ్రైవర్లకు లారీ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తిస్తుందని తెలిపారు. అర్హులై ఇప్పటికీ ఇల్లు పట్టా రానటువంటి వారికి ఇల్లు పట్టాను ఇంటి నిర్మాణాలను చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ఇలా గత ఎన్నికలలో విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఈ ఎన్నికలలో కూడా విడుదల చేస్తూ నగదును పెంచుతూ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇలా సంక్షేమ పథకాల ద్వారా ఎంతో మంది లబ్ధి పొందడమే కాకుండా ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నారని చెప్పాలి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!