Rashmi: యాంకర్ రష్మీ బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ కి వ్యవహరిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ సందర్భంగా రష్మీ తరుచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఈ సమాజంలో మూగ జీవాలపై జరుగుతున్నటువంటి హింసను వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎక్కడైనా జంతువులకు హాని చేస్తే ఈమె తప్పనిసరిగా వాటిపై స్పందిస్తూ హాని చేసిన వారికి శిక్ష పడాలి అంటూ తన గళం వినిపిస్తూ ఉంటారు.
తాజాగా ఈమె ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో భాగంగా ఒక వ్యక్తి ఎద్దును కాల్చి చంపుతూ ఉన్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఇది షేర్ చేసినటువంటి ఈమె ఇది దారుణం మనం ఇలాంటి వాటిని ఎందుకు ఆపలేకపోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఈ కామెంట్ లపై నెటిజన్ స్పందించారు.
మనిషికి, పశువుకి తేడా లేదు..
ఈ సందర్భంగా ఒక నైటిజన్ రిప్లై ఇస్తూ ఆడపిల్లలను రేప్ చేస్తున్నారు. బట్టలు ఊడదీసి నగ్నంగా తిప్పుతున్నారు. చంపేస్తున్నారు. అలాంటి దారుణాల మీద స్పందించని నువ్వు ఒక ఎద్దును చంపితే కామెంట్స్ చేస్తున్నావు. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి… అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ పై రష్మీ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈరోజు ఎద్దును చంపిన వాడు రేపు నీ పిల్లలను కూడా చంపుతారు. మనిషికి పశువుకు తేడా తెలియని బ్రెయిన్ వాడిది అంటూ ఈమె రిప్లై ఇస్తూ చేసిన కామెంట్ వైరల్ అవుతుంది.



























