Actress Hema: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హేమ దుర్గాష్టమి సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది దుర్గాష్టమి రోజు అమ్మవారిని దుర్గమ్మగా దర్శనం చేసుకుంటున్నాను అయితే ఈ ఏడాది కూడా తనకు ఆ భాగ్యం కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.
నా ప్రోటోకాల్ ప్రకారం ఈ రోజు అమ్మవారి దర్శనం కాదనుకున్నాను అయితే అమ్మవారి దర్శనం అయినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఈమె మాట్లాడారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా మిత్రులకు ఈమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నేరుగా అమ్మవారి దర్శనం చేసుకోలేనటువంటి భక్తులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు లైవ్ లో అమ్మవారిని చూపిస్తున్నందుకు మీడియా బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ క్రమంలోనే అమ్మవారి ఆశీస్సులు మీపై కూడా ఉండాలని అలాగే ప్రతి ఒక్కరిపై అమ్మ ఆశీస్సులు ఉండాలని ఈమె మాట్లాడారు. ఇంతవరకు అంతా సవ్యంగా సాగినప్పటికీ ఓ జర్నలిస్టు ఈమెను ప్రశ్నించడంతో హేమా ఒక్కసారిగా ఆ వ్యక్తిపై ఫైర్ అయ్యారు.
మీరు ఫోటోగ్రాల్ ప్రకారమే వచ్చానని చెబుతున్నారు ఇంతకీ టికెట్ కొనుక్కొని వచ్చారా అంటూ ప్రశ్నించారు.ఇలా జర్నలిస్టు అడిగేసరికి ఆగ్రహం కట్టలు తెంచుకున్న హేమ నేను అమ్మవారికి 20వేల రూపాయలు పట్టుచీర తెచ్చాను, అలాగే హుండీలో 10000 వేశాను. అలాగే టికెట్టు కూడా కొనుక్కొని వచ్చాను ఇప్పుడు ఎందుకు దీనిని ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులపై హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…