Actress Jamuna: వెండితెర సత్యభామగా ఎంతో పేరు సంపాదించుకున్న జమున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.1953లో పుట్టిల్లు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైనటువంటి ఈమె తెలుగు తమిళ హిందీ కన్నడ భాషలలో సుమారు 200 కు పైగా సినిమాలలో నటించి మెప్పించారు. ఇలా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జమున వయోభారంతో మరణించిన విషయం తెలిసిందే.
ఇక జమున మరణించడంతో ఈమె గురించి ఎన్నో విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే జమున ఆస్తుల గురించి ప్రస్తుతం ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందరి హీరోయిన్లు మాదిరిగా ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూ సంపాదించిన డబ్బును వృధాగా ఖర్చు చేయలేదు భవిష్యత్తు గురించి ఆలోచించిన జమున తన సంపాదించినది మొత్తం భారీగానే కూడా పెట్టిందని తెలుస్తోంది.
ఈమె ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ తనకు నచ్చిన జీవితాన్ని గడిపారు. తనకు ఎంతో ఇష్టమైన నగలు కొనుగోలు చేశారు. ఇక ఈమె పెట్ లవర్ ఎన్నో రకాల జంతువులను తీసుకువచ్చి వాటిని పెంచుతూ వాటి బాగోగులను చూసుకునేవారు ఇలా వాటి ఫుడ్ కోసం కూడా ఈమె భారీగానే ఖర్చు చేసేవారు. అయితే ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూ సంపాదించినది ఎంత మొత్తంలో ఉందనే విషయానికి వస్తే.
హైదరాబాదులో ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో ఈమె ఉన్నటువంటి ఇల్లు సుమారు 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందట. అన్ని రకాల సౌకర్యాలతో అన్ని హంగులతో నిర్మితమైన ఈ ఇల్లు కొన్ని కోట్ల రూపాయల ఖర్చు చేస్తుందని తెలుస్తుంది.ఇది మాత్రమే కాకుండా హైదరాబాదులో తనకు మరొక పాత బంగ్లా కూడా ఉందట. దీనితో పాటు కొండాపూర్ లో ఖరీదైన ఫ్లాట్ లు ఉన్నాయని సమాచారం.ఇండస్ట్రీలో కొనసాగుతూ కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈమె జూలూరు రమణారావు అనే ప్రొఫెసర్ ను వివాహం చేసుకున్నారు. ఈయన వెంకటేశ్వర యూనివర్సిటీలో పనిచేసేవారు వీరికి వంశీ స్రవంతి అనే ఇద్దరు పిల్లలు కూడా కలరు.
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…