Ramya Ragupathi -Naresh: సీనియర్ నటుడు నరేష్ తన మూడవ భార్య రమ్య రఘుపతి విషయం గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా వీరి వ్యవహారంలో ఒక పెద్ద ట్విస్ట్ నెలకొంది.నరేష్ తన మూడవ భార్య రమ్య రఘుపతి నుంచి తనకు ప్రాణహానీ ఉంది అంటూ కోర్టులో పిటిషన్ వేశారు.
తన భార్య రమ్య రఘుపతి రాకేష్ శెట్టితో కలిసి తనని హత్య చేయడానికి ప్లాన్ చేసిందని ఈయన పిటిషన్ లో పేర్కొన్నారు. రమ్య రఘుపతికి తనకన్నా తన ఆస్తి అంటేనే వ్యామోహం ఎక్కువ అని ఆస్తి కోసం తనను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఈయన ఆరోపించారు.
2010 వ సంవత్సరంలో తాను రమ్యను వివాహం చేసుకున్నానని వివాహం చేసుకున్న కొన్ని నెలల నుంచి తనకు టార్చర్ మొదలైందని తన టార్చర్ భరించలేకపోతున్నాను తనకు వెంటనే విడాకులు ఇప్పించాలని ఈయన కోర్టును కోరుకున్నారు. రమ్య కనీసం తనకు తిండి కూడా పెట్టకుండా నిత్యం పార్టీలు పబ్బులు అంటూ తిరిగేదని.. తెలిసిన వారందరి దగ్గర తన పేరు చెప్పి భారీగా అప్పులు చేసిందని నరేష్ తెలిపారు.
రమ్య నాపై ప్రేమతో కాదు నా ఆస్తిపై ప్రేమతోనే ఇదంతా చేస్తుందని తనకు డబ్బే ముఖ్యమని నరేష్ తెలిపారు. అలాగే 10 లక్షల రూపాయలు ఇస్తే తాను సెటిల్మెంట్ కి వస్తానంటూ మధ్యవర్తితో మాట్లాడినటువంటి ఆడియో కాల్ తన వద్ద ఉందని ఈ సందర్భంగా నరేష్ రమ్య గురించి తెలియజేశారు. మొత్తానికి నరేష్ రమ్య గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…