జయప్రద… అందం, అనుకువు, ధైర్యం కలగాలిపి ఉన్న వ్యక్తి ఆవిడ. ఇక ఈవిడ అసలు పేరు లలితారాణి. జయప్రద 1962 ఏప్రిల్ 3 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబములో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది. జయప్రదకు చిన్నపుడు డాక్టరు అవ్వాలని కోరిక ఉండేది. ఈమె తల్లి ఈమెను ఏడవ సంవత్సరం నుండే నాట్య సంగీత శిక్షణకు పంపినది. తన తండ్రి, బాబాయిలు సినిమా పెట్టుబడిదారులైనప్పటికీ ఈమెకు సినీరంగ ప్రవేశము వారి ద్వారా మాత్రం లభించలేదు. తన 14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం.ప్రభాకర రెడ్డి ఆమె డాన్స్ ను చూసి అవకాశాన్ని కలిగించారు.
ఇలా ప్రభాకరరెడ్డి ఈమెకు జయప్రద అని నామకరణము చేసి 1976 లో విడుదలైన భూమి కోసం సినిమాలో కేవలం మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వారా ఈమెను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. ఇక అంతే అప్పటి నుండి ఆవిడ ఎక్కడ వెన్నకి తిరగకుండా అనేక సినిమాలను చేసింది. ఈవిడ తన నట ప్రస్థానంలో ఏకంగా 300 సినిమాలలో నటించింది అంటే నమ్మండి. ఇక ఆమె చదువు విషయానికి వస్తే పాఠశాల తర్వాత ఈమె రాజమండ్రిలోని రాజలక్ష్మి మహిళా కళాశాలలో చదివినది. కొన్ని సినిమాలు చేసిన ఆమె ఆ తరువాత బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ కొడుకు, సినీనిర్మాత శ్రీకాంత్ నహతాను ఈమె 1986 జూన్ 22 న వివాహమాడినది.
ఇంత వరకు బాగానే ఉన్న ఆమె పుట్టి పెరిగిన రాజమండ్రిలో ఉండే తన సొంతం ఇంటిని ఆమె స్వయంగా కూలగొట్టారు. దానికి కారణం అక్కడ ఏదో కమర్సియల్ కాంప్లెక్స్ కట్టడం కోసం ఆ స్థలంలోని ఆవిడ ఇంటిని పడగొట్టారు. ఆమె పెరిగిన ఆనవాళ్లను చిన్న నాటి గురుతులు అలా కామెరిసిల్ కాంప్లెక్స్ కోసం పడగొట్టడం తో ఆమె అభిమానులు రాజమండ్రి వాసులు ఒకింత డీలా పడ్డారు. కానీ ఏదైనా ఆమె సొంత విషయం కాబట్టి ఎవరు అడ్డు పడలేదు. ఇక ఆమె జీవించినా ఆ ఇంటికి జయప్రద అసలు పేరు అయిన లలిత అనే పేరు పెట్టారట వాళ్ళ అమ్మ గారు. ఏది ఏమైనా లలిత నివాసం ఇక లేదు.
ఇక ఇప్పటికి ఆవిడ ఎంత ఎత్తుకు ఎదిగిన తన సొంత ఊరు అయినా రాజమండ్రి తో మాత్రం తన అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక ఈవిడకి ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు. వారు కూడా సినిమాలలో నటించిన విజయం అందుకోలేక కనుమరుగు అయిపోయారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…