Actress Jayavani : జయవాణి (ఉమామహేశ్వరి) తెలుగు టివీ, చలనచిత్ర నటీమణి. 2006లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. చిన్నప్పటి నుండి సినిమాలపై ఉన్న ఆసక్తితో కూచిపూడి నృత్యం నేర్చుకుంది. జయవాణికి సినిమాల పిప్చి ఎక్కువ కావడంతో 10వ తరగతిలోనే గుమ్మడి చంద్రశేఖర్ రావుతో వివాహం జరిగింది.
పెళ్ళయిన తరువాత బి.ఏ.చదివి, భర్త సహకారంతో నటిగా మారింది. మొదటగా “రండి లక్షాధికారి కండి” అనే టి.వీ. సీరియల్ లో నటించిన జయవాణి, అనేక చిత్రాలలో చిన్నచిన్న పాత్రలు పోషించింది. విక్రమార్కుడు సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. దేశం మొత్తం తలతిప్పుకునేలా చేసిన దక్షిణాది దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సై, విక్రమార్కుడు, చత్రపతి, యమదొంగ, మర్యాద రామన్న లాంటి చిత్రాల్లో జయవాణి నటించారు.
అయితే “సై” చిత్రంలో విలన్ ప్రదీప్ రావత్ కి వ్యాంప్ క్యారెక్టర్ లో జయవాణి కనిపించారు. ఈ మద్య ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు రాజమౌళి చిత్రాల్లో “మర్యాదరామన్న” చిత్రం అంటే చాలా ఇష్టమని అందులో మిగతా చిత్రాలలో లాగా వ్యాంప్ క్యారెక్టర్ కాదని కొంచెం పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉంటుందని ఆ సినిమాలో తన పాత్ర బాగుంటుందని చెప్పారు. తను ఇంట్లో ఉన్నప్పుడు సడన్ గా ఒక ఫోన్ కాల్ వస్తుందని.. కథా, క్యారెక్టర్ గురించి ఏమి చెప్పకుండా అందుబాటులో ఏ వాహనం ఉంటే ఆ వాహనంలో డైరెక్టుగా లొకేషన్ కు రమ్మని చెప్తారు.
దర్శకుడు రాజమౌళి ముందుగా తాము ఎలా చేయాలో చేసి చూపిస్తారని అలా చేయడం వలన సమయం వృధా కాకుండా తొందరగా షాట్ ఓకే అవుతుందని… ముఖ్యంగా సై సినిమా షూటింగ్ లో తన క్యారెక్టర్ గురించి రమారాజమౌళి మొత్తం వివరించారని. రాజమౌళికి లొకేషన్ చేరుకొని గుడ్ మార్నింగ్ చెప్పడం ఇష్టం ఉండదని అలా చెబితే మీకు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ నేను ఉండాలా అంటారని.. ఆయన సరదాగా మాట్లాడతారని లొకేషన్ లో ఎంతో డెడికేషన్ తో పని చేస్తారని, ఆయనకు సినిమా తప్పా మరోలోకం తెలియదని నిజంగా వారితో పని చేయడం తన సొంత పుట్టింట్లో పని చేసినట్టుగా ఉంటుందని జయవాణి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…