Actress Khushbu: అలనాటి అందాల నటి ఖుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఖుష్బూ ఆ తర్వాత హీరోయిన్ గా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. ఖుష్బూ తమిళ్ లో మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 200 పైగా సినిమాలలో నటించింది.
ఇప్పటికీ సినిమాలలో కీలకపాత్రలలో నటించడమే కాకుండా రాజకీయాలలోకి కూడా ప్రవేశించి అటు పాలిటిక్స్ ని ఇటు సినిమాలోని సమానంగా హ్యాండిల్ చేస్తుంది. అంతేకాకుండా తెలుగులో బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో కూడా జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా కుష్బూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.
ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా కుష్బూ నటించిన చిన్నతంబి సినిమా గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
1991లో విడుదలైన చిన్నతంబి సినిమాలో కుష్బూ, ప్రభు జంటగా నటించారు. నేటికి ఈ సినిమా విడుదలై 32 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కుష్బూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ క్రమంలో..” చిన్న తంబి సినిమా విడుదలై 32 ఏళ్లు గడిచింది అంటే నమ్మలేకపోతున్నాను. వాసు ప్రభు కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది. నాపై ఇంత ప్రేమ చూపించిన మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే హృదయాలను కదిలించే సంగీతాన్ని అందించిన ఇళయరాజా గారికి, బాలసుబ్రమణ్యం గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నందిని పాత్ర ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయింది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు అంటూ” కుష్బూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…