Actress Manjima: టాలీవుడ్ హీరో నాగచైతన్య నటించిన సాహసమే శ్వాసగా సాగిపో సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మలయాళీ బ్యూటీ మంజిమ మోహన్ . ఈ సినిమాలో మంజిమ నటనకు, అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా చెప్పుకొదగ్గ హిట్ అందుకోకపోవడంతో ఆ తర్వాత తెలుగు సినిమాలలో నటించే అవకాశం అందుకోలేకపోయింది.
మలయాళంలో మాత్రం చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించి అక్కడ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఎక్కువగా మలయాళీ సినిమాలలో నటించిన మంజుమా ఆ ఇండస్ట్రీకే పరిమితం అయింది.
ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ఒక యువ హీరోతో ప్రేమలో ఉన్నట్లు మలయాళీ మీడియా నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ మలయాళీ బ్యూటీ ప్రేమలో పడింది ఎవరితోనో కాదు..”కడలి” సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన గౌతమ్ కార్తీక్ తో మంజిమ ప్రేమలో పడింది.
చాలాకాలంగా వీరిద్దరి గురించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ వార్తలపై వీరిద్దరూ కూడా ఎక్కడా స్పందించలేదు. ఇక ఇటీవల వీరి ప్రేమ విషయం గురించి గౌతమ్ కార్తీక్ స్వయంగా వెల్లడించాడు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా గౌతమ్ కార్తీక్ తన ప్రేమ విషయం బయట పెట్టాడు. ” ప్రేమకు అర్థమేంటో మంజిమ మోహన్ని చూశాకే తెలిసింది” అంటూ వారి మద్య ఉన్న ప్రేమ బంధాన్ని వెల్లడించాడు.
ఇంతకాలం గుట్టుగా ప్రేమాయణం నడిపిన ఈ జంట ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో తమ ప్రేమ విషయాన్ని ఎట్టకేలకు బయటపెట్టారు.
ఇలా వారి ప్రేమ విషయం అధికారికంగా ప్రకటించగానే వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తొందర్లోనే ఈ జంట కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరి ప్రేమా విషయం బయట పెట్టడంతో సెలబ్రిటీలు కూడా వీరిద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా కడలి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గౌతమ్ కార్తీక్ మరొక తెలుగు సినిమా ద్వారా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…