Actress Manjima: టాలీవుడ్ హీరో నాగచైతన్య నటించిన సాహసమే శ్వాసగా సాగిపో సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మలయాళీ బ్యూటీ మంజిమ మోహన్ . ఈ సినిమాలో మంజిమ నటనకు, అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా చెప్పుకొదగ్గ హిట్ అందుకోకపోవడంతో ఆ తర్వాత తెలుగు సినిమాలలో నటించే అవకాశం అందుకోలేకపోయింది.
మలయాళంలో మాత్రం చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించి అక్కడ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఎక్కువగా మలయాళీ సినిమాలలో నటించిన మంజుమా ఆ ఇండస్ట్రీకే పరిమితం అయింది.
ఇదిలా ఉండగా గత కొంతకాలంగా ఒక యువ హీరోతో ప్రేమలో ఉన్నట్లు మలయాళీ మీడియా నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ మలయాళీ బ్యూటీ ప్రేమలో పడింది ఎవరితోనో కాదు..”కడలి” సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన గౌతమ్ కార్తీక్ తో మంజిమ ప్రేమలో పడింది.
చాలాకాలంగా వీరిద్దరి గురించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ వార్తలపై వీరిద్దరూ కూడా ఎక్కడా స్పందించలేదు. ఇక ఇటీవల వీరి ప్రేమ విషయం గురించి గౌతమ్ కార్తీక్ స్వయంగా వెల్లడించాడు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా గౌతమ్ కార్తీక్ తన ప్రేమ విషయం బయట పెట్టాడు. ” ప్రేమకు అర్థమేంటో మంజిమ మోహన్ని చూశాకే తెలిసింది” అంటూ వారి మద్య ఉన్న ప్రేమ బంధాన్ని వెల్లడించాడు.
ఇంతకాలం గుట్టుగా ప్రేమాయణం నడిపిన ఈ జంట ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో తమ ప్రేమ విషయాన్ని ఎట్టకేలకు బయటపెట్టారు.
ఇలా వారి ప్రేమ విషయం అధికారికంగా ప్రకటించగానే వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తొందర్లోనే ఈ జంట కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరి ప్రేమా విషయం బయట పెట్టడంతో సెలబ్రిటీలు కూడా వీరిద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా కడలి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గౌతమ్ కార్తీక్ మరొక తెలుగు సినిమా ద్వారా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…