Actress Meena: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించిన మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీనా పెళ్లయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా తెలుగులో ఈమె సన్నాఫ్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను సందడి చేశారు.ఈ సినిమా తర్వాత పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మీనా వరుస షూటింగ్లలో పాల్గొంటున్న సమయంలో తన భర్త మరణ వార్త తనని కృంగదీసింది. తన భర్త విద్యాసాగర్ అకాల మరణంతో మీనా దుఃఖసాగరంలోకి వెళ్లిపోయింది. మీనా భర్త మరణ వార్త తెలియగానే ఎంతోమంది సినీ ప్రముఖులు ఆమెను పరామర్శించి తనకు ధైర్యం చెప్పారు.
ఇక భర్త మరణం తర్వాత బయటకురాని మీన మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చారు.ఇకపోతే ఈమె ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈమె తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే షూటింగ్ లొకేషన్లో నటి కిరీటీ రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. జులై 19వ తేదీ ఈయన పుట్టినరోజు కావడంతో ఈయన పుట్టినరోజు సందర్భంగా అలీ తన భార్య జుబేదా కూడా హాజరయ్యారు.ఈ క్రమంలోనే జుబేదా మీనా గారితో మాట్లాడుతూ ఉన్న వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో జుబేదా మీనా గారిని మొదటిసారి ఎప్పుడు కలిశారనే విషయాన్ని చెబుతూ అందుకు సంబంధించిన ఫోటోలను మీనాకు చూపించారు.ఇకపోతే ఈ వీడియోని ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు సైతం మీనాని తిరిగి ఇలా చూడడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…