Actress Nagma: పెరుగుతున్న సాంకేతిక టెక్నాలజీని ఆధారంగా చేసుకుని మోసాలకు పాల్పడే వారి సంఖ్య కూడా అధికమవుతుంది. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లు బాగా చదువుకొని సంపాదించే వారిని సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే.
నటి నగ్మా కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈమె తాను మోసపోయిన విషయాన్ని తెలియచేశారు.తనకు తన మొబైల్ నంబర్ కు ఒక బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చిందని తెలిపారు. అయితే ఆ బ్యాంక్ మెసేజ్ క్లిక్ చేయగానే తనకు ఫోన్ వచ్చిందని అవతల వ్యక్తి తాను బ్యాంక్ ఉద్యోగిని అంటూ పరిచయం చేసుకున్నారని తెలిపారు.
ఇలా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ మాట్లాడిన ఆ వ్యక్తి కేవైసీ అప్డేట్ చేయాలని అడిగారు. అయితే అప్పటికి తాను తన వివరాలను ఇవ్వకపోయినప్పటికీ సదరు వ్యక్తి ఆన్లైన్లోనే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లోలాగిన్ అయ్యారని తెలుస్తుంది. ఇలా అవతల వ్యక్తి లాగిన్ అయ్యే సమయంలో దాదాపు తనకు 20 వరకు ఓటీపీలు వెంట వెంటనే వచ్చాయని నగ్మా తెలిపారు.
ఇలా వెంటనే ఓటీపీలు వచ్చిన తర్వాత తన అకౌంట్ నుంచి లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయని ఈమె వెల్లడించారు.అయితే సెలబ్రిటీలు అన్న తర్వాత వారి అకౌంట్లో భారీ మొత్తంలో డబ్బు ఉంటుంది కానీ ఈమె అకౌంట్ నుంచి లక్ష రూపాయలు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడంతో కాస్త బాధలో కూడా ఊపిరి పీల్చుకున్నాను అని ఈమె తెలిపారు. ఇక వెంటనే తాను ముంబై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశానని తెలిపారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…