Actress Priya Raman : భారత్ బంద్ సినిమా ప్రతి కథానాయకుడైన కాస్ట్యూమ్స్ కృష్ణ.. కోడి రామకృష్ణ తీయబోతున్న “మా ఊరి మారాజు” చిత్రంలో నటించడానికి రెండో హీరోయిన్ గా ప్రియారామన్ ని అడగడం జరిగింది. ఆ సమయానికి ప్రియారామన్ తమిళనాడులో ‘వల్లి’ అనే సినిమాలో రజనీకాంత్ ప్రక్కన హీరోయిన్ గా నటించి ఉన్నారు. ఆ సినిమా తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ క్రమంలో మా ఊరి మారాజు చిత్రంలో పొగరుబోతు క్యారెక్టర్ ఉందని అది మీరైతే బాగుంటుందని ప్రియారామన్ కు చెప్పి ‘మా ఊరి మారాజు’ చిత్రంలో నటించడానికి కాస్ట్యూమ్ కృష్ణ ఆమెను ఒప్పించారు. అలా హీరోయిన్ ప్రియారామన్ తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చిన ‘మావూరి మారాజు’ చిత్రంలో నటించారు.
షూటింగ్ సమయంలో తెలుగు సరిగ్గా రాకపోవడంతో కోడి రామకృష్ణ ప్రియరామన్ చేత డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించారు. ఆ సినిమా తెలుగులో మోస్తారు విజయాన్ని సాధించింది. ఆ తర్వాత తెలుగులో శ్రీవారి ప్రియురాలు, కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శుభసంకల్పం చిత్రంలో కూడా ప్రియారామన్ నటించారు. అయితే ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియరామన్ మాట్లాడుతూ..
1995లో బోయినసుబ్బారావు దర్శకత్వంలో శోభన్ బాబు హీరోగా, నేను హీరోయిన్ గా ఒక సినిమా అనుకున్నారు. ఆ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కోసం నేను ఒక ఫ్లైట్ లో చెన్నై నుండి హైదరాబాద్ వస్తున్నాను. అదే ఫ్లైట్ లో హీరో శోభన్ బాబు కూడా వస్తున్నారు. నా పక్క సీట్లోనే కూర్చున్నారు. ఆయన ఎవరో తెలియక అంకుల్.. అంకుల్ అంటూ పిలిచాను. నన్ను ఆశ్చర్యంగా చూశారు. ఆ తర్వాత నవ్వుకున్నాడు. ఇక దొరబాబు షూటింగ్ విరామంలో మా మమ్మీ తో మీ కూతురు నన్ను ఇందాక వస్తున్న ఫ్లైట్ లో అంకుల్.. అంకుల్ అని పిలిచిందని నవ్వుకుంటూ చెప్పారు.
ఇదివరకు నేను శోభన్ బాబు గారిని చూడలేదు. నా పక్క సీట్లో కూర్చుంది ఎవరో పెద్దాయన అనుకున్నాను. ఆ తర్వాత ఆయనే దొరబాబు చిత్రంలో హీరోగా నటిస్తున్న శోభన్ బాబు గారు అని తెలిసింది. ఆ తర్వాత కూడా నేను చాలా అవాక్కయ్యాను. సెట్లో ఆయన ఎంతో సరదాగా ఉంటారు. నేను తెలుగులో తక్కువ సినిమాలు చేసిన గుర్తుండిపోయే పాత్రలు చేశానని ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…