Actress Roja: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రోజా రాజకీయాలలోకి వచ్చే రాజకీయాలలో కూడా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.రాజకీయాలలో మొదట్లో కాస్త నిరాశ ఎదురైనప్పటికీ అనంతరం ఈమె ఎమ్మెల్యేగా గెలవడం ప్రస్తుతం అధికార పార్టీలో మంత్రిగా కూడా కొనసాగుతున్నారు.ఇలా సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలోనూ రోజా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రోజా తన వృత్తిపరమైన విషయాల గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలు గురించి కూడా ప్రస్తావనకు తీసుకువచ్చారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తన వృత్తిపరమైన పనుల వల్ల తన పిల్లలపై శ్రద్ధ చూపించే అవకాశం కూడా తనకు లేకుండా పోయిందని ఈమె తెలిపారు. ఇక కరోనా సమయంలో తన పనులకు బ్రేక్ ఇచ్చి తన పిల్లలపై ప్రేమ చూపించే సమయం దొరికినందుకు తాను చాలా సంతోషపడ్డానని తెలిపారు.
ఇక సెలబ్రిటీల జీవితం ఎంతో కష్టతరంగా ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. వీరి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి.కేవలం సెలబ్రిటీల గురించి మాత్రమే కాకుండా కొన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇలాంటి బాధలు రోజా కూతురు అన్షు మాలిక కూడా పడిందని ఈమె తెలియజేశారు.
కొందరు సోషల్ మీడియాలో తన కుమార్తె ఫోటోలను మార్పింగ్ చేసే తన గురించి అసభ్యకరమైన పోస్టులు చేశారని రోజా తెలిపారు. ఇది చూసిన తన కుమార్తె ఎంతో ఆవేదన వ్యక్తం చేసిందని ఈ సందర్భంగా రోజా తెలిపారు. అన్షు చాలా సెన్సిటివ్ ఇలాంటి విషయాలు గురించి పదేపదే ఆలోచిస్తూ ఎంతో బాధపడుతుంది అందుకే ఈ విషయాన్ని మేము పెద్దగా చేయలేదు.తన గురించి వచ్చిన ట్రోల్స్ చూసి ఇలాంటివన్నీ మనకు అవసరమా అంటూ తనని మొహం మీదే అడిగిందని రోజా తెలిపారు. అయితే సెలబ్రిటీలు అన్న తర్వాత ఇలాంటివి సర్వసాధారణమేనని తన పిల్లలకు అర్థమయ్యేలా తాను వివరించానని రోజా తెలిపారు.
గుజరాత్లోని కష్టభంజన్ హనుమాన్ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఆలయంలో హనుమంతుడి పాదాల చెంతనే శనిదేవుడు కొలువుదీరినట్లు…
మార్కెట్లో కనిపించే బొప్పాయిలు రంగు, ఆకారం చూసి చాలామంది వెంటనే కొనేస్తుంటారు. కానీ బయటకు ఆకర్షణీయంగా కనిపించే ప్రతి పండు…
చాలామంది పల్లీలను చిన్నపాటి స్నాక్గా మాత్రమే భావిస్తారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం వేరుశెనగలను పూర్తి స్థాయి పోషకాహారంగా గుర్తిస్తున్నారు.…
పూజా కార్యక్రమాల్లో హారతి అనేది ముఖ్యమైన భాగంగా భావిస్తారు. దేవుడికి నైవేద్యం సమర్పించిన తరువాత కర్పూరం లేదా దీపంతో హారతి…
ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం మన సంస్కృతిలో భాగం. అయితే కొన్ని ప్రత్యేక మొక్కలకు ఆధ్యాత్మికంగా, వాస్తు పరంగా కూడా…
ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2026 సందర్భంగా శ్వాసకోశ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మే…