Actress Sadaa: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి జయం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి అనంతరం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సదా గురించి అందరికీ సుపరిచితమే. ఈమె ప్రస్తుతం వెండితెరకు దూరమైనప్పటికీ బుల్లితెరపై పలు కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా బుల్లితెర రియాలిటీ షోలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నటువంటి సదా తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈమె షేర్ చేసినటువంటి ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.చాలామంది తమ మనసుకు నచ్చిన వారిని ఎక్కడ కోల్పోతామని భయపడుతూనే ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆ మనసుకు నచ్చిన వారే మోసం చేస్తూ ఉంటారు.
ఇలాంటి వారితో ఉన్నామంటే మనల్ని మనం ప్రమాదంలో పడేసుకున్నట్టేనని తెలిపారు. ఒకరి కోసం మీరు ఎన్ని త్యాగాలు చేసిన మీకు సరైన గుర్తింపు రాకపోతే మనం చేసిన త్యాగాలకు అర్థం లేదు. ఎందుకంటే మనతో పాటు చివరి వరకు ఉండేది అంతరాత్మ మాత్రమే. మన జీవితంలో ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ చివరి వరకు నీకు నువ్వు మాత్రమే తోడుంటావు.
మన ఇంట్లో అవసరం లేనటువంటి వస్తువులను ఎలాగైతే పడేస్తుంటామో మన జీవితంలో అవసరం లేని బంధుత్వాలను దూరం పెట్టడం మంచిది.ఇలాంటి బలవంతపు బంధుత్వాలలో చిక్కుకోవడం కన్నా ఒంటరితనమే మంచిది అంటూ సదా చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…