Actress Sadaa: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి జయం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి అనంతరం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సదా గురించి అందరికీ సుపరిచితమే. ఈమె ప్రస్తుతం వెండితెరకు దూరమైనప్పటికీ బుల్లితెరపై పలు కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇలా బుల్లితెర రియాలిటీ షోలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నటువంటి సదా తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈమె షేర్ చేసినటువంటి ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.చాలామంది తమ మనసుకు నచ్చిన వారిని ఎక్కడ కోల్పోతామని భయపడుతూనే ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆ మనసుకు నచ్చిన వారే మోసం చేస్తూ ఉంటారు.
ఇలాంటి వారితో ఉన్నామంటే మనల్ని మనం ప్రమాదంలో పడేసుకున్నట్టేనని తెలిపారు. ఒకరి కోసం మీరు ఎన్ని త్యాగాలు చేసిన మీకు సరైన గుర్తింపు రాకపోతే మనం చేసిన త్యాగాలకు అర్థం లేదు. ఎందుకంటే మనతో పాటు చివరి వరకు ఉండేది అంతరాత్మ మాత్రమే. మన జీవితంలో ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ చివరి వరకు నీకు నువ్వు మాత్రమే తోడుంటావు.
మన ఇంట్లో అవసరం లేనటువంటి వస్తువులను ఎలాగైతే పడేస్తుంటామో మన జీవితంలో అవసరం లేని బంధుత్వాలను దూరం పెట్టడం మంచిది.ఇలాంటి బలవంతపు బంధుత్వాలలో చిక్కుకోవడం కన్నా ఒంటరితనమే మంచిది అంటూ సదా చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…