Actress Shanthi Priya: ప్రముఖ నటి భానుప్రియ సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి శాంతి ప్రియ.మహర్షి సినిమాతో తెలుగులోకి వచ్చినటువంటి ఈమె ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళం బాలీవుడ్ సినిమాలలో కూడా నటించి మెప్పించారు.
ఇలా ఇండస్ట్రీలో నటిగా ఎంతో బిజీగా గడుపుతున్న సమయంలో ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శాంతి ప్రియ తన వ్యక్తిగత విషయాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా శాంతి ప్రియ మాట్లాడుతూ తాను కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పనిచేశానని తెలిపారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు ఏడాదిన్నర పాటు ఐదు సినిమాలలో నటించానని ఆ సమయంలోనే తాను సిద్ధార్థ్ రాయ్ తో ప్రేమలో పడ్డానని తెలిపారు.ఇలా ప్రేమలో ఉన్న తామిద్దరం పెళ్లి చేసుకున్నామని పెళ్లి తర్వాత తాను సినిమాలలో నటించకూడదని తనకి ఎవరు ఎలాంటి కండిషన్లు పెట్టలేదని అయితే తానే గృహిణిగా ఉండటం కోసం పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యానని తెలిపారు.
ఇక నా భర్త చనిపోయిన తర్వాత నేను పెద్ద షాక్ లో ఉండిపోయాను. నాకు ముంబైలో ఎవరూ తెలియదు అందుకే ఇంటి నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు ఆ సమయంలో తన అక్క తల్లి సోదరుడు తనకు ఎంతో మద్దతుగా నిలబడ్డారు. అయితే వాళ్ళు చెన్నైకి రమ్మని చెప్పినప్పటికీ తాను మాత్రం ఎవరి అండదండలు లేకుండా ఒంటరి మహిళగా బతుకుతున్నటువంటి అమ్మను చూసి ఎంతో ధైర్యం తెచ్చుకొని తన కాళ్లపై తాను నిలబడాలని నిర్ణయించుకున్నాను. ఇక చాలా కాలం తర్వాత ధారవి బ్యాంక్ అనే వెబ్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చానని తెలిపారు. ఇక తనకు వెంకటేష్ తో నటించాలని కోరికగా ఉండేది కానీ ఆ కోరిక నెరవేరే లేదని తెలిపారు.
సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా టాలీవుడ్లో మైలురాయిగా నిలిచిన…
ప్రసిద్ధ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం, అలాగే ప్రముఖ నటుడు జూనియర్…
హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య పరిస్థితుల్లో నాలుగు గంటల పాటు గాల్లోనే తిరుగుతూ…
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…