టాలీవుడ్లో అగ్ర హీరోలకు సంబంధించిన ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ.. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రముఖ నటి సురేఖా వాణి. కేవలం సినిమాల్లో కనిపించడమే కాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఇటీవల సురేఖా… తన స్నేహితురాలు రజితతో కలిసి ప్రముఖ టాల్క్ షోలో పాల్గోంది.
అందులో తన రెండో పెళ్ళికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు సురేఖా.ఇక బిగ్ స్క్రీన్ పై ఎప్పుడూ సంప్రదాయంగా కనిపించే సురేఖా.. సోషల్ మీడియాలో మాత్రం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలతోపాటు.. మోడ్రన్ లుక్కులో ఉండే ఫోటోలను షేర్ చేస్తూ..ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇటీవల సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న సందర్భంగా సురేఖా కూడా రెండో పెళ్ళి చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇక ఈ వార్తలపై గతంలోనే సురేఖా క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఓ టాల్క్ షోలో పాల్గోన్న ఆమె మరోసారి ఈ విషయాలపై స్పందించింది. తన కెరీర్ ప్రారంభమై 22 ఏళ్లు పైగా అవుతుందని పేర్కొన్న ఆమె సీటీ కేబుల్లో కెరీర్ స్టార్ట్ అయ్యిందని అక్కడ తన బాబాయ్ పని చేస్తూ ఉండడంతో ఆయన ప్రోద్బలంతో ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూలు చేస్తూ ఇక్కడి దాకా వచ్చానని ఆమె చెప్పుకొచ్చింది.
అలాగే తన రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వార్తలు వచ్చేవరకు తనకు తెలియదని తాను ఎవరిని పెళ్ళి చేసుకుంటున్న అనే విషయం.. ఆయన ఎవరో తెలిస్తే చెప్పాలని కోరింది. ఒకవేళ సంబంధం చూస్తే.. కాస్తా డబ్బున్న వాళ్ళను చూడాలని తెలిపింది. దీంతో మనసున్న వాళ్ళు కావాలా? డబ్బున్న వాళ్ళు కావాలా? అని యాంకర్ అడగ్గా.. మనసుతో పనులు జరగవని అర్థమైపోయిందని, డబ్బున్న వాళ్ళయితే బెటర్ అని అంటోంది సురేఖా వాణి…!!
వేసవి సెలవుల సందడి ముగిసింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ విద్యార్థులతో కళకళలాడాల్సిన రోజు…
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాలు కొంత ఉపశమనం…
అర్ధరాత్రి వేళ పరుగులు తీస్తున్న ఎక్స్ప్రెస్ రైలులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం…
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…