టాలీవుడ్లో ప్రస్తుతం వరుస హిట్స్ తో సక్సెస్ ఫుల్ హీరోగా మారాడు సూపర్ స్టార్ మహేష్ బాబు..భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ అనే సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగాఉన్నాడు మహేష్… గీత గోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడంతోపాటు పేరు తెచ్చుకున్న దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తాన్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పరశురామ్. ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు మహేష్. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఫోటోలు సినిమా పై ఆసక్తిని పెంచేసాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది.
గతంలో ఈ ఇద్దరు కలిసి అతడు, ఖలేజా విషయం తెలిసిందే. ఇక మహేష్, త్రివిక్రమ్ సినిమా గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని నటిస్తుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమాను డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కించారు.
ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. అయితే మహేష్ -త్రివిక్రమ్ సినిమాకు ముందుగా పూజాహెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. ఇప్పుడు దిశా పేరు వినిపిస్తుంది. అయితే ఇటీవల త్రివిక్రమ్ సినిమా అంటే మినిమమ్ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. కాబట్టి ఈ సినిమాలో కూడా ఇద్దరు ఉండే అవకాశం ఉందని, అందుకనే దిశాపటానితో సంప్రదింపులు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి..మరి త్రివిక్రమ్ ఈ బాలీవుడ్ బ్యూటీ కి ఛాన్స్ ఇస్తాడా.. లేక వేరే హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తాడా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే…!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…