Actress Trisha: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా గత రెండు దశాబ్దాలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి త్రిష ఒకరు. ఈమె వరుస సినిమాలలో నటిస్తూ ఒకానొక సమయంలో ఎంతో బిజీ బిజీగా గడిపారు. ఇక ప్రస్తుతం కాస్త అవకాశాలు తగ్గినప్పటికీ ఈమెకు మాత్రం ఎలాంటి క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.
ఇకపోతే త్రిష తాజాగా మణిరత్నం దర్శకత్వంలో నటించిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఈమె కుందవై పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా త్రిష ఎన్నో వ్యక్తిగత విషయాల గురించి కూడా చర్చలు జరిపారు. అయితే ముఖ్యంగా తన పెళ్లి విషయంపై ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలోనే పెళ్లి గురించి తనని చాలామంది ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తుంటారని ఈ ప్రశ్నలు తనకు కొన్నిసార్లు చాలా చిరాకు తెప్పిస్తాయని వెల్లడించారు. పెళ్లి అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశం. పెళ్లి విషయంలో తొందరపడి పెళ్లి అయిన వెంటనే విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ప్రస్తుతం నా చుట్టూ ఉన్న వారందరూ కూడా ఇలా పెళ్లి జీవితం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారే. అందుకే పెళ్లి విషయంలో తాను తొందరపడటం లేదని తెలిపారు.
జీవితంలో ఒక వ్యక్తి నాకు జీవితాంతం తోడుగా ఉంటాడు. అని భావించినప్పుడే తాను పెళ్లి చేసుకుంటానని అలాంటి మిస్టర్ ఫర్ఫెక్ట్ కోసం తాను ఎదురుచూస్తున్నానని ఈ సందర్భంగా త్రిష పెళ్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈమెకు ఆ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఎప్పుడు దొరుకుతారు ఈమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే.
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…
తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…