Actress Trisha:కోలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు కోలీవుడ్ చిత్ర పరిశ్రమలు విజయ్ నెంబర్ వన్ హీరో అంటూ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. విజయ్ నెంబర్ వన్ హీరో అనడంతో అజిత్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే దక్షిణాది సిని ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి త్రిష తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈమె నటించిన చిత్రం రాంగి.ఈ సినిమా డిసెంబర్ 31వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నెంబర్ వన్ హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురవడంతో ఈమె ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
హీరో విజయ్ అజిత్ ఇద్దరూ కూడా ఎంతో ఫాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు.వీరిద్దరిలో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే చెప్పడం చాలా కష్టమని వీరిద్దరూ కూడా ఒకే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలని ఈమె సమాధానం చెప్పారు. వ్యక్తిగతంగా తనకు నెంబర్ గేమ్స్ పై ఏమాత్రం నమ్మకం లేదని తెలిపారు.
మనం నటించిన చివరి సినిమా విజయం అందుకుంటే మనమే నెంబర్ వన్ అని లేదంటే ఆ స్థానంలోకి మరొకరు వస్తారని తెలిపారు.తాను ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి అజిత్ విజయ్ ఇద్దరు కూడా ఎంతో మంచి స్టార్డం ఉన్న హీరోలుగా పేరుపొందారు. ఇలా ఈ ఇద్దరు హీరోలలో నెంబర్ వన్ ఎవరో చెప్పడం కష్టమని ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై త్రిష షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…