Adipurush: ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆదిపురుష్.రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో సందడి చేయగా కృతి సనన్ సీతమ్మ పాత్రలో నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు. ఇలా ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని పనుల కారణంగా వాయిదా పడతా వస్తుంది.
ఇక ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి వీడియోలో పోస్టర్లు పెద్ద ఎత్తున వివాదానికి కారణమయ్యాయి.అసలు రాముడికి గడ్డం మీసాలు పెట్టడం ఏంటి హిందువుల పవిత్రంగా భావించే శ్రీరాముడిని ఇలా రూపురేఖలు మార్చి చూపించడంతో చాలామంది విమర్శలు చేశారు.
ఇలా ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నటువంటి ఈ చిత్రం మరొక అరుదైన గౌరవాన్ని అందుకుంది. ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ ఈ సినిమా ప్రదర్శనకు ఎంపిక కావడంతో ఈ విషయాన్ని డైరెక్టర్ ఓం రౌత్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సంతోషాన్ని మించిన విషయం ఇది 2023 జూన్ 13వ తేదీ న్యూయార్కులో జరగనున్న ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ లో మన సినిమా ప్రదర్శన కానుండడం ఎంతో సంతోషంగా ఉంది.
ఈ ఫిలిం ఫెస్టివల్ కు ఆది పురుష్ సినిమాను ఎంపిక చేసిన ట్రిబెకా జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు అలాగే ఆది పురుష్ టీం అందరికీ ధన్యవాదాలు అంటూ ఈయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలా ఈ సినిమా విడుదల కాకముందు ఎన్నో విమర్శలను ఎదుర్కొంది అయితే విడుదల కాకముందు కూడా ఈ సినిమా ఇలాంటి గుర్తింపు అందుకోవడంతో ప్రభాస్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…