పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ఆదిపురుష్. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాతో ప్రంపంచస్థాయి నటుడిగా గుర్తింపు పొందాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ . ఆ తరువాత ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ బాహుబలి సినిమాతో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం కూడా విధితమే.
ఆ తర్వాత తీసిన ప్రతీ సినిమాను అతడు పాన్ ఇండియా లెవల్లోనే ప్లాన్ చేస్తున్నారు. 3డీ టెక్నాలజీతో ఈ సినిమాను భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నాడు ఓంరౌత్. రామాయణ గాథ నేపథ్యంలో తెరకెక్కనుండగా.. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో రావణుడిగా నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించనుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్నాడన్న వార్తల నేపథ్యంలో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు కన్ ఫామ్ చేసేసింది.
అంతకు ముందు కచ్చితంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేమని చెప్పిన యూనిట్ సభ్యులు ప్రస్తుతం ఆ డేట్ కన్ ఫామ్ చేసేశారు. ప్రస్తుతం రెబల్ స్టార్ సలార్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆదిపురుష్ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…