పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న సినిమా ఆదిపురుష్. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాతో ప్రంపంచస్థాయి నటుడిగా గుర్తింపు పొందాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ . ఆ తరువాత ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ బాహుబలి సినిమాతో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం కూడా విధితమే.
ఆ తర్వాత తీసిన ప్రతీ సినిమాను అతడు పాన్ ఇండియా లెవల్లోనే ప్లాన్ చేస్తున్నారు. 3డీ టెక్నాలజీతో ఈ సినిమాను భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నాడు ఓంరౌత్. రామాయణ గాథ నేపథ్యంలో తెరకెక్కనుండగా.. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో రావణుడిగా నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించనుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్నాడన్న వార్తల నేపథ్యంలో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు కన్ ఫామ్ చేసేసింది.
అంతకు ముందు కచ్చితంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేమని చెప్పిన యూనిట్ సభ్యులు ప్రస్తుతం ఆ డేట్ కన్ ఫామ్ చేసేశారు. ప్రస్తుతం రెబల్ స్టార్ సలార్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆదిపురుష్ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…