సినీ నటుడు పోసాని కృష్ణ మురళి.. జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్పై సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన మండి పడ్డారు. సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో మాట్లాడిన విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.జగన్ పై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి కాదు.. సినీ పరిశ్రమ మనిషి అని పోసాని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ రెమ్యూనరేషన్ పై అతడు స్పందించాడు. పవన్ రెమ్యూనరేషన్ రూ.10 కోట్లా.. రూ.50 కోట్లా.. అని ప్రశ్నించారు. పవన్ కేవలం రూ.10 కోట్లు మాత్రమే తీసుకుంటున్నట్లు చెబుతున్నారు..
కానీ తాను రూ.15 కోట్లు ఇస్తానని.. తన నాలుగు సినిమాలకు సంతకం చేస్తాడా.. అంటూ ప్రశ్నించాడు. అతడు రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదని నిరూపిస్తే.. తనను చెంప దెబ్బ కొట్టండంటూ.. సవాల్ విసిరాడు. పవన్ కళ్యాణ్ ఏంటో సినీ పరిశ్రమకు, ప్రపంచానికి బాగా తెలుసని వెటకారంగా అన్నారు. జగన్ తో అసలు పవన్ కి పోలికే లేదని మండిపడ్డారు.
సీఎం జగన్ కు కులపిచ్చి ఉందని నిరూపించగలరా..? అని ప్రశ్నించారు. ‘రిపబ్లిక్’ సినిమా ఫంక్షన్ లో సీఎం, మంత్రులను తిట్టడం ఏంటని తీవ్రంగా మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ తో పోల్చుకుని వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ కు లేదని అన్నారు. ఇకపోతే తనకు.. చిరంజీవికి ఎలాంటి గొడవలు లేవని స్ఫష్టం చేశారు. పవన్ సినిమాలకు టిక్కెట్ రెట్లు రూ. 500, రూ.1000 అంటే ఏంటి.. మధ్య తరగతి మరియు సామాన్యులను హింసించడమే కదా అంటూ ప్రశ్నించారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…