Adivi Sesh: సాధారణంగా ఒక సినిమా మంచి విజయం సాధిస్తే ఆ సినిమాకు సీక్వెల్ చిత్రం చేస్తుంటారు అయితే సీక్వెల్ చిత్రంలో కూడా అదే హీరో హీరోయిన్ దర్శకనిర్మాతలు సినిమాను చేయడం సర్వసాధారణం కానీ హిట్ సినిమా విషయంలో మాత్రం కాస్త భిన్నంగా జరిగింది. హిట్ సినిమాలో విశ్వక్, రుహాని శర్మ హీరో హీరోయిన్లుగా నటించగా ఈ సినిమాకు సీక్రెట్ చిత్రంగా వస్తున్న హిట్ 2 లో మాత్రం అడివి శేష్ మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా సందడి చేయనున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ప్రస్తుతం ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే హిట్ సినిమాలో నటించిన విశ్వక్ ఈ సినిమా సీక్వెల్లో నటించకపోవడానికి గల కారణం ఏంటనే విషయం మరోసారి తనపైకి వచ్చింది. చిత్ర బృందం కావాలనే విశ్వక్ ను పక్కన పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి.
అదేవిధంగా ఈ సినిమా స్టోరీ హీరో విశ్వక్ కి నచ్చలేదని అందుకే సైడ్ అయిపోయారనే టాక్ ఇండస్ట్రీలో వినపడుతోంది. ఏదిఏమైనా హిట్ 2 నుంచి విశ్వక్ తప్పుకోవడంతో అడివి శేష్ ఎంట్రీ ఇచ్చారు.ఇక ఈ సినిమాని ఫాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తాజాగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా హీరో అడివి శేష్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
హిట్ 3 లో కూడా నేనే హీరో..
డైరెక్టర్ శైలేష్ తో పాటు మనందరికీ ఈ ట్రైలర్ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ అంటూ చెప్పుకొచ్చారు. ట్రైలర్ ఇంత అద్భుతంగా కట్ చేసినందుకు డైరెక్టర్ గారికి మరోసారి కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు. ఈ హిట్ యూనివర్సిస్ లో సెకండ్ పార్ట్ ఎంతో కీలకంగా ఉందని, అలాగే హిట్ 3 లో కూడా నేనే నటించబోతున్నానని ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు. హిట్ 2, 3 కి ఏ మాత్రం పోలిక ఉండదని పూర్తిగా విభిన్నంగా ఉండబోతుంది అంటూ ఈ సందర్భంగా అడివి శేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…