Pawan Kalyan:ప్రముఖ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పలు నవలల ఆధారంగా మెగాస్టార్ చిరంజీవికి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన విషయం మనకు తెలిసిందే.ఇలా మెగాస్టార్ కి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన యండమూరి గారు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని భావించి వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా ప్రకటించారు. అయితే ఈ సినిమా ప్రకటించిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగానే సినిమా ఆగిపోయింది.
ఈ విధంగా ఈ సినిమా ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయం మరోసారి వార్తల్లో నిలిచాయి. సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఇలా గత విషయాలన్నింటిని కూడా సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే యండమూరి పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో అనౌన్స్ చేసిన సినిమా ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయం మరోసారి వైరల్ గా మారింది.
వీరిద్దరి కాంబినేషన్లో డైరీ ఆఫ్ మిసెస్ శారద అనే చిత్రాన్ని చేయాలని అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ బోస్ అనే పాత్రలో నటించబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాని ఆపివేశారు. అయితే డైరీ ఆఫ్ మిసెస్ శారద అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి అందరికీ ముందుగా తెలిసి ఉంటుంది. నవల చదివిన వారందరికీ ఈ సినిమా స్టోరీ ఏంటో అర్థం అవుతుంది.
లేడీ ఓరియంటెడ్ చిత్రం అనే భావన కలుగుతుంది..
ఇకపోతే ఈ సినిమా టైటిల్ విన్న తర్వాత ఎవరైనా కానీ ఇది లేడీ ఓరియంటెడ్ చిత్రం అని భావిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం సెట్ కాదనే ఉద్దేశంతో యండమూరి గారు ఈ కథను పక్కన పెట్టారని సమాచారం. ఈ విధంగా ఎన్నో నవలలు ఆధారంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న యండమూరి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేకపోయారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…