Pawan Kalyan:ప్రముఖ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పలు నవలల ఆధారంగా మెగాస్టార్ చిరంజీవికి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన విషయం మనకు తెలిసిందే.ఇలా మెగాస్టార్ కి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన యండమూరి గారు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని భావించి వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా ప్రకటించారు. అయితే ఈ సినిమా ప్రకటించిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగానే సినిమా ఆగిపోయింది.
ఈ విధంగా ఈ సినిమా ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయం మరోసారి వార్తల్లో నిలిచాయి. సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఇలా గత విషయాలన్నింటిని కూడా సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే యండమూరి పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో అనౌన్స్ చేసిన సినిమా ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయం మరోసారి వైరల్ గా మారింది.
వీరిద్దరి కాంబినేషన్లో డైరీ ఆఫ్ మిసెస్ శారద అనే చిత్రాన్ని చేయాలని అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ బోస్ అనే పాత్రలో నటించబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాని ఆపివేశారు. అయితే డైరీ ఆఫ్ మిసెస్ శారద అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి అందరికీ ముందుగా తెలిసి ఉంటుంది. నవల చదివిన వారందరికీ ఈ సినిమా స్టోరీ ఏంటో అర్థం అవుతుంది.
లేడీ ఓరియంటెడ్ చిత్రం అనే భావన కలుగుతుంది..
ఇకపోతే ఈ సినిమా టైటిల్ విన్న తర్వాత ఎవరైనా కానీ ఇది లేడీ ఓరియంటెడ్ చిత్రం అని భావిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం సెట్ కాదనే ఉద్దేశంతో యండమూరి గారు ఈ కథను పక్కన పెట్టారని సమాచారం. ఈ విధంగా ఎన్నో నవలలు ఆధారంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న యండమూరి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేకపోయారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…