Vijayendra Prasad:టాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయేంద్ర ప్రసాద్ గురించి అందరికీ సుపరిచితమే. ఈయన ఎన్నో అద్భుతమైన తెలుగు సినిమాలకు కథలను అందించడమే కాకుండా బాలీవుడ్ సినిమాకి కూడా కథా రచయితగా పనిచేశారు. ఇలా ఇండస్ట్రీలో రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన రాజ్యసభ సభ్యునిగా కూడా పదవి దక్కించుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా గోవాలో జరుగుతున్నటువంటి 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విజయేంద్ర ప్రసాద్ రైటింగ్ విభాగానికి చెందిన విషయాల గురించి క్లాసెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
మనం మన చుట్టూ జరుగుతున్న విషయాల నుంచి ఏదైనా ఒక కొత్తదనాన్ని వెలికి తీసి వాటిని ఆవిష్కరించడమే రచయిత ముఖ్య లక్షణం అంటూ ఈయన వెల్లడించారు.ఒక రచయిత కథ సిద్ధం చేస్తే అది దర్శక నిర్మాతలతో పాటు ప్రేక్షకులు కూడా ఆదరించే లాగా ఉండాలి.ఈ విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నామని ఒక అబద్ధాన్ని అందంగా తయారు చేసి చూపించడమే రచయిత లక్షణం అంటూ తెలిపారు.
అబద్ధాలు చెప్పే వారే స్టోరీ రైటర్స్…
మన చుట్టూ మన నిజజీవితంలోనే ఎన్నో కథలు ఉన్నాయి. నేను వీటి ఆధారంగా కథను దొంగలిస్తాను అంటూ ఈయన షాకింగ్ విషయాలు బయట పెట్టారు. మన చుట్టూ రామాయణం మహాభారతం వంటి ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి. వాటి నుంచి కథలు తీసుకొని వాటిని అందరూ ఇష్టపడే విధంగా మలుచుకుంటానని తెలిపారు.ఇక అబద్ధాలు ఎక్కువగా చెప్పే వారే మంచి స్టోరీ రైటర్స్ అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…