Dil Raju : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు గురించి అందరికీ సుపరిచితమే. ఈయన సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి అనంతరం నిర్మాతగా మారారు. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ నిర్మితగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఈ విధంగా దిల్ రాజు వృత్తిపరమైన జీవితంలో ఎంతో సక్సెస్ అయ్యారు.
ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే దిల్ రాజు అనిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. ఈమె వివాహం జరిగి తన వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే గుండెపోటుతో అనిత మరణించడంతో దిల్ రాజు తేజస్విని అనే అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్నారు.
తేజస్విని దిల్ రాజు దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించారు.అయితే ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు తన భార్య తేజస్వినికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. తేజస్వినికి కాలేజీ చదువుతున్న రోజులలోనే మోడలింగ్ రంగంలోకి వెళ్లాలని ఎంతో ఆశగా ఉండేదట అయితే తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు నిరాకరించడంతో చేసేదేమీ లేక ఈమె తన కోరికను చంపుకున్నారు.
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్న తేజస్విని..
ఇక దిల్ రాజును పెళ్లి చేసుకున్న తర్వాత మరోసారి ఈమె తన కోరికను తన భర్త ముందు ప్రస్తావించడంతో ఆయన తన భార్య కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసే తనని మోడలింగ్ రంగంలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. అదేవిధంగా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టబోతున్నారని పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించడానికి తేజస్విని సిద్ధమవుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…