Adivi Sesh: రెజీనా కసాండ్రా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె తాజాగా శాకిని డాకిని అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ థియేటర్లో విడుదల కానుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నివేద థామస్ రెజీనా ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రెజీనా మగాళ్ళ గురించి మాట్లాడుతూ మగాళ్లు మ్యాగీ మాదిరే రెండు నిమిషాల్లో అయిపోతారు అంటూ కామెంట్ చేశారు.అయితే ఇది జోక్ అని చెప్పినప్పటికీ ఈ మాటలు విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇలా మగాళ్ళ గురించి రెజీనా చేసిన ఈ కామెంట్స్ పై పలువురు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో అడివి శేష్ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొనడమే కాకుండా ఈమె చేసిన ఈ కామెంట్స్ పై స్పందిస్తూ నటి రెజీనాకు స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. ఈ క్రమంలోనే శేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ ఏంటి ఈ మధ్య మగాళ్లు మ్యాగీ అంటూ ఏదో మాట్లాడావట.. నాకు స్టామినా ఎక్కువ అందుకే ఎక్కువ కాలం సినిమాలు చేస్తుంటానని అందరూ అంటూ ఉంటారని శేష్ సమాధానం చెప్పారు. దీంతో రెజీనా స్పందిస్తూ రెండు నిమిషాల్లో చెబుతా అంటూ ఒక్కసారిగా నవ్వేసింది. ఈ విధంగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…
ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…
హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…