Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ కి ఎలాంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఇక ఈయన అందరితో ఎంతో మంచితనంగా ఉంటూ అందరి పట్ల ఎంతో ప్రేమను రాగాలను వ్యక్తపరుస్తుంటారు. ఈ అలవాటు ప్రభాస్ కి తన పెదనాన్న కృష్ణంరాజు నుంచి వచ్చిందని చెప్పాలి.
ఇలా ప్రభాస్ ఎప్పుడు కూడా తన చుట్టూ ఉండే వారికి ఆకలి లేకుండా వాళ్లు కడుపునిండా భోజనం తినేలా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి ఎన్నోసార్లు ప్రస్తావించారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఈయన మంచితనంపై అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణించడంతో పెద్ద ఎత్తున అభిమానులు కృష్ణంరాజు అంత్యక్రియలలో పాల్గొన్నారు. ఇలా తన పెదనాన్న అంత్యక్రియల కోసం వచ్చిన అభిమానుల గురించి ప్రభాస్ ఆలోచించి వారికి భోజనాలు ఏర్పాటు చేయించారు.అంత్యక్రియల అనంతరం ప్రభాస్ అందరూ భోజనం చేసే వెళ్ళండి డార్లింగ్ అంటూ అభిమానులకు తెలియజేశారు.అంత బాధలో ఉండి కూడా ప్రభాస్ ఇలా అభిమానుల గురించి ఆలోచించి వారికి భోజనం చేసి వెళ్ళమని చెప్పడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ క్రమంలోనే ఈ వీడియోని సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేస్తూ నిజం గానే మీమనసు ఎంతో మంచిది అంత బాధలో ఉండి కూడా అభిమానుల గురించి ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉంటారంటూ ఈయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే మరికొందరు రాజు ఎక్కడున్నా రాజే అంటూ ఆ వీడియోని షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక తనని ఎంతగానో ప్రోత్సహిస్తూ తన పట్ల ఎంతో ప్రేమగా ఉన్నటువంటి పెదనాన్న చనిపోవడంతో ప్రభాస్ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి కష్ట సమయంలో కూడా ఈయన అభిమానుల పట్ల వ్యవహరించిన శైలి అందరిని ఆకట్టుకుంటుందని చెప్పాలి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…