పునీత్ రాజ్ కుమార్ నటుడే కాదు.. ఎన్నో సేవా కార్యక్రమాలలో భాగస్వాముడు కూడా. ఆయన ఆధ్వర్యంలో 26 అనాథాశ్రమాలు, 25 పాఠశాలలు, 15 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు నడుస్తున్నాయి. 1800 మంది పేద విద్యార్ధులకు ఆయన చదువు చెప్పిస్తున్నారు. మైసూరులో బాలికా విద్యార్ధినులతో కూడిన శక్తి ధామ అనే ఓ అతిపెద్ద స్వచ్ఛంద సంస్థను కూడా ఆయన నడుపుతున్నారు.
ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అయినా ఆ సేవలను ప్రచారం చేసుకోవడానికి అతడు ఏ మాత్రం ఇష్టపడలేదు. ఇంత గొప్ప వ్యక్తి మరణం ఎవరినీ జీర్ణించుకోలేక చేసింది. నిన్న జరిగిన సంస్మరణ సభలో దక్షిణాది నుంచి చాలామంది నటీనటులు పాల్గొని.. అతడికి నివాళులు అర్పించారు. ఎంతో మంది ఈ సభలో కన్నీటి పర్యంతం అయ్యారు.
అయితే భర్త మరణం తర్వాత రాజ్ కుమార్ భార్య అశ్విని తొలిసారి ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో అశ్విని అంతగా యాక్టివ్ గా ఉండరు. అయినా ఆమె ఆ పోస్టును చేయడానికి ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసి తొలిపోస్ట్ ను పునీత్ కు అంకితమిచ్చారు. పునీత్ ఈ అకాల మరణం కర్టాటక ప్రజలను షాక్ కు గురి చేసిందని.. చెప్పుకొచ్చారు అశ్విని ఆ లేఖలో.
పునీత్ కు ప్రజలు, అభిమానులు అంతిమ వీడ్కోలు పలికారని తెలిపారు. పునీత్ ను ఫాలో అవుతూ.. ఎంతో మంది నేత్రదానం చేయడానికి ముందుకు వస్తున్నారని.. అతడిపై ఉన్న అభిమానం చూస్తుంటూ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని ఆమె తెలిపారు. భౌతికంగా పునీత్ దూరం అయినా.. అభిమానుల గుండెల్లో ఎప్పుడూ సజీవంగానే ఉంటారని ఆమె భావోద్వేగపూరితమైన లేఖను షేర్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…