Ameesha Patel-Faisal Patel బద్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి కుర్రకారు మదిని దోచుకున్న బ్యూటీ అమీషా పటేల్. తను అంతలా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ బద్రి సినిమా తరవాత మహేష్ తో నాని, ఎన్టీఆర్ తో నరసింహుడు లాంటి సినిమాలు చేసినా పెద్దగా టాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోయింది.
అటు బాలీవుడ్ లో కూడా పెద్దగా హిట్లు కూడా నమోదుకాలేదు. దీంతో కెరీర్ పరంగా అమీషా పటేల్ వెనకబడిపోయింది. అయితే ఈ అమ్మడు మాత్రం తన ఘాటు ఫోటోలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. 45 ఏళ్ల వయసులో కూడా తన అందాలతో యువత మనసును దోచుకుంటుంది.
ఎప్పుడూ ఏదో ఓ ఫోటోతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తూ ఉంటుంది. ఇక పర్సనల్ లైఫ్ గురించి అమీషా పటేల్ ఎప్పుడూ సిక్రెట్ పాటిస్తుంది. ఇప్పటి వరకు లవ్, ఎఫైర్స్ వంటి వాటికి అమీషా పటేల్ దూరంగానే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ విషయం మాత్రం సంచలనంగా మారింది. అమీషా పటేల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కుతున్నారనే వార్త నెట్టింట్ల వైరల్ గా మారింది.
దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తనయుడు ఫైజల్ పటేల్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల డిసెంబర్ 30న ఫైజల్ పటేల్ పుట్టిన రోజు సందర్భంగా.. అమిషా పటేల్ ‘హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్.. ఐ లవ్ యు..‘‘ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. దీనికి ప్రతిగా ఫైజల్ సంచలన రిప్లే ఇచ్చాడు. ‘థాంక్యూ అమీషా.. నేను ఈ సందర్భంగా పబ్లిక్ గా ప్రపోజ్ చేస్తున్నా.. నన్ను పెళ్లి చేసుకుంటావా ?’ అని రిప్లై ఇచ్చాడు. అయితే వెంటనే పోస్ట్ ను డిలీట్ చేసినా.. అప్పటికే నెట్టింట ఇది వైరల్ గా మారింది.
దీంతో రానున్న రోజుల్లో అమీషా పటేల్ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 45 ఏళ్లకు చేరిన అమీషా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టెలా ఉంది. ఇదిలా ఉంటే ఫైజల్ అమీషా పటేల్ కన్నా మూడేళ్లు చిన్నవాడు. ఇప్పటికే ఫైజల్ పటేల్ కు వివాహం జరిగినా… 2016లో ఫైజల్ భార్య జైనాబ్ పటేల్ కార్డియాక్ సమస్యలతో మరణించారు. అయితే కొంత కాలంగా సింగిల్ గా ఉంటున్న ఫైజల్ పటేల్.. అమిషాతో ప్రేమలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…