Featured

Radhe Shyam: త్వరలో ఓటీటీలో రాధేశ్యామ్.. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయా.. అసలు నిజం ఏంటి?

Radhe Shyam: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి మరోసారి కరోనా దెబ్బతాకింది. రాష్ట్రాలన్నీ కరోనా ఆంక్షల్లోకి వెళ్లాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాకు పెద్ద ఎదురుదెబ్బలు తాకాయి. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ జనవరి 7న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Radhe Shyam: త్వరలో ఓటీటీలో రాధేశ్యామ్.. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయా.. అసలు నిజం ఏంటి?

ఓమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న క్రమంలో పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్ చేయాలని అక్కడి ప్రభుత్వాలు ఆదేశించాయి.  భారీ బడ్జెట్ చిత్రాలకు ఇప్పుడు కరోనా కారణంతో సెగ తగిలింది. ఇప్పటికే ఆర్ ఆర్ఆర్ఆర్ వాయిదా పడగా… ’రాధేశ్యామ్‘ సినిమాపై ప్రేక్షకులకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాధేశ్యామ్ సినిమా జనవరి 14న విడుదల అవుతుందని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

Radhe Shyam: త్వరలో ఓటీటీలో రాధేశ్యామ్.. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయా.. అసలు నిజం ఏంటి?

అయితే ఆర్ఆర్ఆర్ లాగే ఇది కూడా వాయిదా పడుతుందనే రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే కొంత మంది మాత్రం రాధే శ్యాం ఓటీటీల్లో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నారు. అయితే ఈ వాదనను కొట్ట పారేయలేమని అంటున్నారు. అయితే ఫ్యాన్సీ ఆఫర్ వస్తే ఓటీటీలో కూడా రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్లు మరో సమస్య..

ప్రస్తుతం కరోనా వేవ్ ఎన్ని రోజులు ఉంటుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. దీంతో ఓటీటీలో విడుదల చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా థియేటర్ల మూతపడటంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ల రేట్లు మరోసమస్యగా భారీ బడ్జెట్ ప్రతిరోధకంగా ఉంది. టికెట్ ధరలపై కమిటీ వేసినా… ధరలు పెరుగుతాయనే నమ్మకం లేదు. ఇప్పటికే పుష్ప, శ్యాంసింగరాయ్ సినిమాలకు ఏపీలో కలెక్షన్లు తక్కువగానే వచ్చాయి. దీంతో పాటు కరోనా ముప్పుతో థియేటర్లు మూతపడటం లేకపోతే 50 శాతం ఆక్యుపెన్సీతో నడిచేలా ఉన్న పరిస్థితుల్లో రాధేశ్యామ్ యూనిట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నడుము నొప్పి బాధిస్తుందా? గంటల తరబడి కూర్చోవడం ప్రమాదం.. బ్యాక్ పెయిన్ తగ్గించే సింపుల్ టిప్స్!

నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…

3 hours ago

డెంగీ నుంచి రక్షణకు సింపుల్ టిప్స్.. ప్రతి ఇంటికి అవసరమైన అవగాహన!

నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…

3 hours ago

సాయికుమార్ తల్లి డైరీలో షాకింగ్ విషయం.. రాజశేఖర్ ఎమోషనల్..!

సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…

3 hours ago

వేసవిలో బెస్ట్ కూర ఇదే.. శరీరానికి చల్లదనం, రుచికి అదిరిపోయే టేస్ట్!

ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…

3 hours ago

జయంతి వేడుకలతో విజయవాడలో భక్తి వాతావరణం.. ఆలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు!

ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…

4 hours ago

పడుకునే ముందు ఈ నీళ్లు తాగితే ఆరోగ్యంలో మార్పులు స్పష్టమే!

ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…

4 hours ago