Air India plane crash - Former Chief Minister Vijay Rupani dies!
Vijay Rupani : గుజరాత్ను దిగ్భ్రాంతికి గురిచేస్తూ ఒక పెను విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లో కుప్పకూలిన ఘటనలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి మరణించారని టికెట్ ఆధారంగా ఎయిర్ ఇండియా అధికారికంగా ధృవీకరించింది. ఈ వార్త యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. NDRF (జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం)కి చెందిన 90 మంది సిబ్బంది అహ్మదాబాద్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. క్షతగాత్రులను కాపాడేందుకు, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు వడోదర నుండి అదనంగా మరో 3 బృందాలు హుటాహుటిన బయలుదేరాయి.
గురువారం నాడు అహ్మదాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న Air India AI-171 విమాన ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది.
Director General of Civil Aviation (DGCA) అందించిన సమాచారం ప్రకారం, విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం ప్రమాదానికి గురికావడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై DGCA విచారణకు ఆదేశించింది.
ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికుల భద్రత గురించి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…