Vijay Rupani : గుజరాత్ను దిగ్భ్రాంతికి గురిచేస్తూ ఒక పెను విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లో కుప్పకూలిన ఘటనలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి మరణించారని టికెట్ ఆధారంగా ఎయిర్ ఇండియా అధికారికంగా ధృవీకరించింది. ఈ వార్త యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది.

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. NDRF (జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం)కి చెందిన 90 మంది సిబ్బంది అహ్మదాబాద్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. క్షతగాత్రులను కాపాడేందుకు, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు వడోదర నుండి అదనంగా మరో 3 బృందాలు హుటాహుటిన బయలుదేరాయి.

గురువారం నాడు అహ్మదాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న Air India AI-171 విమాన ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది.
Director General of Civil Aviation (DGCA) అందించిన సమాచారం ప్రకారం, విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం ప్రమాదానికి గురికావడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై DGCA విచారణకు ఆదేశించింది.
ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికుల భద్రత గురించి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.

































