Air India plane crashes in Gujarat, serious accident!
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. మేఘాని ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.
ప్రారంభ సమాచారం ప్రకారం విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యల కారణంగానే ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సహాయక చర్యల కోసం 12 ఫైర్ ఇంజన్లను సంఘటనా స్థలానికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్కు బయలుదేరాల్సి ఉంది. అయితే విమానాశ్రయం నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం వేచి చూద్దాం.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…