Air India plane crashes in Gujarat, serious accident!
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. మేఘాని ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.
ప్రారంభ సమాచారం ప్రకారం విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యల కారణంగానే ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సహాయక చర్యల కోసం 12 ఫైర్ ఇంజన్లను సంఘటనా స్థలానికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్కు బయలుదేరాల్సి ఉంది. అయితే విమానాశ్రయం నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం వేచి చూద్దాం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…