గుజరాత్లోని అహ్మదాబాద్లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. మేఘాని ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

ప్రారంభ సమాచారం ప్రకారం విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యల కారణంగానే ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సహాయక చర్యల కోసం 12 ఫైర్ ఇంజన్లను సంఘటనా స్థలానికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
🚨Plane crash incident captured on camera #Ahmedabad #airindia #planecrash pic.twitter.com/PzxXI4wQ1F
— TeluguDesk (@telugudesk) June 12, 2025
ఈ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్కు బయలుదేరాల్సి ఉంది. అయితే విమానాశ్రయం నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం వేచి చూద్దాం.
🚨 TRAGIC NEWS! Passenger plane CRASH just meters away from Ahmedabad airport.
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 12, 2025
— PRAYERS 🙏 pic.twitter.com/5w7tnkmGaM































