Akhil: అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్ననాటి నుండి ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న అఖిల్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకోలేకపోతున్నాడు . ఎందుకంటే ఇప్పటివరకు అఖిల్ హీరోగా నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అఖిల్ నుండి ఒక మంచి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఒక యాక్షన్ అడ్వెంచర్స్ సినిమాతో అఖిల్ ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమయ్యాడు. సీనియర్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ ఏజెంట్ ‘ సినిమా ద్వారా అఖిల్ ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి.
అఖిల్ ఈసారి ప్రమోషన్స్ పై గట్టిగా దృష్టి పెట్టాడు. ఏ ఛాన్స్ వదిలిపెట్టకుండా సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లతో హడావిడి చేస్తున్నాడు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో అఖిల్ పాల్గొన్నాడు. ఈ క్రమంలో అఖిల్ మాట్లాడుతూ .. ‘ఏజెంట్’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
అంతే కాకుండా మల్టీ స్టారర్ సినిమాల గురించి మాట్లాడుతూ…’ మల్టీ స్టార్ సినిమా చేసే అవకాశం వస్తే రామ్ చరణ్ తో కలిసి నటించటానికి ఇష్టపడతాను, కథ దొరికితే చరణ్ తో కలసి సినిమా చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు. అంతే కాకుండా కుటుంబంతో కలసి మల్టీస్టారర్ సినిమాలలో నటించటం గురించి మాట్లాడుతూ..’ మనం ‘ లాంటి సినిమా అవకాశాలు తరచుగా రావని, కానీ అవకాశం వస్తె అన్నయ్య నాగచైతన్యతో కలిసి నటిస్తానని తెలిపాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…