Alekhya Reddy: భర్త చివరి కోరిక తీర్చనున్న అలేఖ్య రెడ్డి…. గుడివాడ ఎన్నికల బరిలో అలేఖ్య!

Alekhya Reddy: నందమూరి తారకరత్న మరణం తర్వాత అలేఖ్య ఒంటరైన విషయం మనకు తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న నేపథ్యంలో నందమూరి కుటుంబం తారకరత్నను ఇంటికి దూరంగా ఉంచారు. ఈ క్రమంలోనే తారకరత్న తన భార్య అలేఖ్య ముగ్గురు పిల్లలతో ఎంత సంతోషంగా ఉండేవారు అయితే తారకరత్న గత కొద్ది రోజుల క్రితం గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే.

ఇలా తారకరత్న మరణంతో అలేఖ్య ఎంతో కృంగిపోయారు. తన భర్తను తలుచుకుంటూ తన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ బాధను తెలియజేస్తున్నారు. అయితే తాజాగా అలేఖ్యకు సంబంధించిన ఓ వార్త సినీ రాజకీయ రంగాలలో తీవ్ర చర్చలకు కారణమైంది. అలేఖ్య రెడ్డి వచ్చే ఎన్నికలలో గుడివాడ ఎమ్మెల్యేగా టిడిపి పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధమయ్యారన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

తారకరత్న సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయినా రాజకీయాలలో కొనసాగాలని భావించారు. ఈ క్రమంలోని గుడివాడ నుంచి తాను పోటీ చేయాలనే నిర్ణయించుకున్నారట అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే తారకరత్న అనుకోకుండా గుండెపోటుకి గురై మరణించడంతో ఆ కోరిక అలాగనే ఉండిపోయిందట.

Alekhya Reddy: ఎమ్మెల్యే అభ్యర్థిగా అలేఖ్య రెడ్డి…


ఈ క్రమంలోనే తన భర్త చివరి కోరికను తీర్చడం కోసం అలేఖ్య రెడ్డి ఎన్నికల బరిలో దిగబోతున్నారని సమాచారం.ఈ క్రమంలోనే అలేఖ్యను గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి చంద్రబాబునాయుడు ఏ విధంగాను అధికారిక ప్రకటన తెలియజేయలేదు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.