Alekhya Reddy: నందమూరి తారక రత్న మరణించడంతో ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి ఇప్పటికీ ఆ విషయం నుంచి బయట పడలేకపోతున్నారు.అతి చిన్న వయసులోనే తారకరత్న గుండెపోటుకు గురి కావడంతో అలేఖ్య రెడ్డి ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఏకధాటిగా కంటతడి పెడుతున్నారు.
ఈ క్రమంలోనే తన భర్తతో తనకు ఉన్నటువంటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈమె ఇదే మా చివరి ప్రయాణం ఇదే మా ఆఖరి ఫోటో అంటూ ఒక ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారకరత్న మరణించడానికి కొద్ది రోజుల ముందు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లారు.
ఇలా స్వామివారిని దర్శించుకున్నటువంటి అలేఖ్య తారకరత్న వారి పిల్లలతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..తనతో ఇదే చివరి ప్రయాణం అవుతుందని నేను అసలు ఊహించుకోలేదు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇదే మా చివరి ఫోటో అని తలుచుకుంటే గుండె ముక్కలవుతుంది.
ఇదంతా ఓ కళ అయితే ఎంత బాగుంటుందో నువ్వు ఒక్కసారి అమ్మ బంగారు అంటూ పిలిస్తే వినాలని ఉంది అంటూ ఈమె తన భర్తను తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి ఎంతోమంది అభిమానులు తొందరగా అలేఖ్య రెడ్డి ఈ బాధ నుంచి బయటపడే ధైర్యాన్ని తనకు ప్రసాదించమని భగవంతుడిని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ అందరిని ఎంతగానో కలిచి వేస్తుంది.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…