Alekhya Reddy: నందమూరి తారక రత్న మరణించడంతో ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి ఇప్పటికీ ఆ విషయం నుంచి బయట పడలేకపోతున్నారు.అతి చిన్న వయసులోనే తారకరత్న గుండెపోటుకు గురి కావడంతో అలేఖ్య రెడ్డి ఈ విషయాన్ని జీర్ణించుకోలేక ఏకధాటిగా కంటతడి పెడుతున్నారు.
ఈ క్రమంలోనే తన భర్తతో తనకు ఉన్నటువంటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈమె ఇదే మా చివరి ప్రయాణం ఇదే మా ఆఖరి ఫోటో అంటూ ఒక ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారకరత్న మరణించడానికి కొద్ది రోజుల ముందు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లారు.
ఇలా స్వామివారిని దర్శించుకున్నటువంటి అలేఖ్య తారకరత్న వారి పిల్లలతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..తనతో ఇదే చివరి ప్రయాణం అవుతుందని నేను అసలు ఊహించుకోలేదు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇదే మా చివరి ఫోటో అని తలుచుకుంటే గుండె ముక్కలవుతుంది.
ఇదంతా ఓ కళ అయితే ఎంత బాగుంటుందో నువ్వు ఒక్కసారి అమ్మ బంగారు అంటూ పిలిస్తే వినాలని ఉంది అంటూ ఈమె తన భర్తను తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి ఎంతోమంది అభిమానులు తొందరగా అలేఖ్య రెడ్డి ఈ బాధ నుంచి బయటపడే ధైర్యాన్ని తనకు ప్రసాదించమని భగవంతుడిని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ అందరిని ఎంతగానో కలిచి వేస్తుంది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…