స్మార్ట్ఫోన్తో ఆర్థిక లావాదేవీలు చాలా సులుభతరం అయిపోయాయి. బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేయాలన్నా.. విత్ డ్రా చేయాలన్నా ఎక్కువ సమయం కేటాయించేవారు. అంతేకాకుండా..బ్యాంక్ కు వెళ్లాలంటే రవాణా ఖర్చులు కూడా అయ్యేయి. ప్రస్తుతం డిజిటల్ యుగంలో పేమెంట్లు కూడా డిజిటల్ అయ్యాయి. వాటి కోసం ఎన్నో ఆర్థిక లావాదేవీల యాప్ లు వచ్చాయి.
స్మార్ట్ఫోన్ వచ్చిన తర్వాత లావాదేవీలన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. బ్యాంకింగ్ యాప్స్తో భారీ లావాదేవీలు సైతం నిమిషాల్లో చేసేయొచ్చు. ఇదిలా ఉండగా.. బ్యాంక్ యాప్స్ ఉన్న వాళ్ల ఫోన్లలో కొన్న యాప్ లు ఉండటం అనేది డేంజర్ గా మారుతుంది. అదేంటంటే.. బ్యాంకింగ్ లావాదేవీల్లో ఈ మోసాలను అడ్డుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లను అప్రమత్తం చేస్తూనే ఉంటోంది. తాజాగా దానికి సంబంధించి కస్టమర్లను అలర్ట్ చేసింది.
స్మార్ట్ఫోన్ యూజర్లు నాలుగు యాప్స్ని ఇన్స్టాల్ చేయకూడదని హెచ్చరిస్తోంది. అందులో ముఖ్యంగా Teamviewer, Mingleview, Anydesk, Quick Support లాంటివి అస్సలు ఇన్ స్టాల్ చేసుకోవద్దని తెలిపింది. ఇవి ఉంటే.. హ్యాకర్లు మీ ఫోన్ ను సింపుల్ గా హ్యాక్ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. అపరిచిత వ్యక్తుల నుంచి మీరు గిఫ్ట్ గెలిచారని.. లాటరీ తగిలిందని ఎవరైనా ఫోన్ చేసినా వాటికి స్పందించొద్దని పేర్కొంది.
డెబిట్ కార్డ్ నెంబర్, క్రెడిట్ కార్డ్ నెంబర్, సీవీవీ, పిన్ లాంటి వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది కూడా అడగరని చెబుతోంది బ్యాంకు. ఎవరైనా ఇలా ఫోన్ చేసి వివరాలు అడిగినట్లయితే 1800111109 నెంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://cybercrime.gov.in/ లో కంప్లైంట్ ఇవ్వొచ్చని ఎస్బీఐ తమ ఖాతాదారులకు సూచించింది.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…