పదేళ్ల క్రితం ఇతరులకు డబ్బులు జమ చేయాలన్నా, అకౌంట్ లో ఉన్న డబ్బులను తీసుకోవాలన్నా బ్యాంకులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పటితో పోలిస్తే ఏటీఎంల వినియోగం చాలా తక్కువ. మారుతున్న కాలానికి అనుగుణంగా గూగుల్ పే, ఫోన్ పే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ప్రజలు సులభంగా డిజిటల్ లావాదేవీలు చేయగలుగుతున్నారు. రోజురోజుకు వీటికి ప్రాధాన్యత పెరుగుతోంది.
గూగుల్ పే, ఫోన్ పేల ద్వారా లావాదేవీలు జరిగితే ఏదో ఒక రూపంలో క్యాష్ బ్యాక్ లను కూడా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా వీటిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే సైబర్ మోసగాళ్లు గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులను బోల్తా కొట్టించి వాళ్ల ఖాతాలలో డబ్బులను మాయం చేస్తుండటం గమనార్హం. గూగుల్ పే ద్వారా లావాదేవీలు జరిపే వాళ్లకు స్క్రాచ్ కార్డులు లభిస్తాయి.
ఈ స్క్రాచ్ కార్డుల ద్వారా కొంత నగదు రివార్డు రూపంలో మన బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. అయితే సైబర్ నేరగాళ్లు యాప్ వాడుతున్న వినియోగదారులకు గూగుల్ పే రివార్డ్ వచ్చినట్టు మెసేజ్ లు పంపి గూగుల్ పే ను పోలి ఉండే నకిలీ పేజీలను ఆన్ లైన్ లో సృష్టిస్తున్నారు. అక్కడ స్క్రాచ్ కార్డులు కనిపించేలా చేసి ఆ కార్డులను స్క్రాచ్ చేసిన వారికి పెద్ద మొత్తంలో నగదు వచ్చినట్టు చూపించి మన గూగుల్ పేకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మొబైల్ కు వచ్చిన ఫేక్ మెసేజ్ లను, ఫేక్ స్క్రాచ్ కార్డులను నమ్మితే మన ఖాతాలలోని డబ్బులు మాయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గూగుల్ పే నుంచి అరుదుగా మాత్రమే పెద్ద మొత్తంలో రివార్డులు లభిస్తాయి. అందువల్ల ఎక్కువ మొత్తం రివార్డులను చూసి ఆశ పడి మన వివరాలు అందజేస్తే మాత్రం మనం ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…