Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అమ్మతనంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. చిరకాల ప్రేమికుడు రణబీర్ కపూర్ ని వివాహం చేసుకున్న ఆలియా గతేడాది నవంబర్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆలియా సినిమాలకు బ్రేక్ ఇచ్చి కూతురితోనే పూర్తి సమయాన్ని గడుపుతుంది. ఇక సోషల్ మీడియా వేదికగా తన కూతురుతో గడిపిన సమయం గురించి అభిమానులతో పంచుకుంటుంది.
ఇక తాజాగా మెట్ గాల ఫ్యాషన్ ఈవెంట్ కోసం నాలుగు రోజులపాటు కూతురికి దూరంగా ఉన్న ఆలియా.. తన కూతురుని బాగా మిస్ అవుతున్నట్లు ఎమోషనల్ అయింది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆలియా కి పిల్లల గురించి ఒక ప్రశ్న ఎదురవగా చాలా ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో.. కెరీర్లో మంచి పీక్స్ లో ఉన్న సమయంలో తల్లి అవ్వాలని ఎందుకు అనిపించింది? అని విలేకరులు ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ఆలియా స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ఈ క్రమంలో ఆలియా భట్ మాట్లాడుతూ..’ పాప నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు పాపకి సంబంధించిన ఎన్నో విషయాలు రణబీర్ ని అడిగారు. కానీ.. కెరీర్ ప్రారంభ దశలో బిడ్డను కనటం ధైర్యమైన నిర్ణయమా ? అని రణబీర్ ని ఎందుకు ప్రశ్నించలేదు అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.
ఇలాంటి ప్రశ్నలు కేవలం హీరోయిన్స్ ని ఎందుకు అడుగుతారు అంటూ అసహనం వ్యక్తం చేసింది.
నా కెరియర్ ప్రారంభమై 10 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు బిడ్డని కనటం నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమాలైనా, వ్యక్తిగత జీవితమైనా నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనది అనిపిస్తేనే చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. గతంలో పెద్దపెద్ద సినిమాలలో నాకు అవకాశాలు వచ్చినా కూడా వదులుకున్నాను. నాకు నచ్చని పనిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయను. దయచేసి ఇలాంటి ప్రశ్న మరొకసారి నన్ను అడగద్దు అంటూ ఆలియా సమాధానం ఇచ్చింది. దీంతో ఆలియా మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…