Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అమ్మతనంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. చిరకాల ప్రేమికుడు రణబీర్ కపూర్ ని వివాహం చేసుకున్న ఆలియా గతేడాది నవంబర్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆలియా సినిమాలకు బ్రేక్ ఇచ్చి కూతురితోనే పూర్తి సమయాన్ని గడుపుతుంది. ఇక సోషల్ మీడియా వేదికగా తన కూతురుతో గడిపిన సమయం గురించి అభిమానులతో పంచుకుంటుంది.
ఇక తాజాగా మెట్ గాల ఫ్యాషన్ ఈవెంట్ కోసం నాలుగు రోజులపాటు కూతురికి దూరంగా ఉన్న ఆలియా.. తన కూతురుని బాగా మిస్ అవుతున్నట్లు ఎమోషనల్ అయింది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆలియా కి పిల్లల గురించి ఒక ప్రశ్న ఎదురవగా చాలా ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో.. కెరీర్లో మంచి పీక్స్ లో ఉన్న సమయంలో తల్లి అవ్వాలని ఎందుకు అనిపించింది? అని విలేకరులు ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ఆలియా స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ఈ క్రమంలో ఆలియా భట్ మాట్లాడుతూ..’ పాప నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు పాపకి సంబంధించిన ఎన్నో విషయాలు రణబీర్ ని అడిగారు. కానీ.. కెరీర్ ప్రారంభ దశలో బిడ్డను కనటం ధైర్యమైన నిర్ణయమా ? అని రణబీర్ ని ఎందుకు ప్రశ్నించలేదు అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.
ఇలాంటి ప్రశ్నలు కేవలం హీరోయిన్స్ ని ఎందుకు అడుగుతారు అంటూ అసహనం వ్యక్తం చేసింది.
నా కెరియర్ ప్రారంభమై 10 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు బిడ్డని కనటం నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమాలైనా, వ్యక్తిగత జీవితమైనా నేను ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనది అనిపిస్తేనే చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. గతంలో పెద్దపెద్ద సినిమాలలో నాకు అవకాశాలు వచ్చినా కూడా వదులుకున్నాను. నాకు నచ్చని పనిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయను. దయచేసి ఇలాంటి ప్రశ్న మరొకసారి నన్ను అడగద్దు అంటూ ఆలియా సమాధానం ఇచ్చింది. దీంతో ఆలియా మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…
తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…
భారతదేశంలో ఉద్యోగ రంగంలో కీలక మార్పులకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త లేబర్ కోడ్లు ఇప్పుడు…