Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన ఇటీవల ముంబై వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ తన సినిమాల గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. అలాగే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గురించి కూడా పలు విషయాలు తెలిపారు.
దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఈయనని ఓ సందర్భంగా ఓ ప్రశ్న వేశాను ఎందుకని నువ్వు బాలీవుడ్ సినిమాలు చేయలేదు అంటూ ప్రశ్న వేయడంతో వెంటనే దేవిశ్రీప్రసాద్ నువ్వు వెంటనే బాలీవుడ్ వెళ్లి సినిమాలు చేయి నేను నీ సినిమాకు మ్యూజిక్ చేస్తాను అంటూ సమాధానం చెప్పారు.
ఇలా దేవిశ్రీప్రసాద్ మాట్లాడటంతో నేను ఒకటే మాట చెప్పాను నేను ఎప్పటికీ కూడా హిందీ భాషలో సినిమాలు చేయనని తనకు చెప్పానని అల్లు అర్జున్ ఈ సందర్భంగా తెలియజేశారు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇప్పుడున్న పరిస్థితులలో అడుగుపెట్టడం అంటే చాలా కష్టం అంటూ ఈయన పరోక్షంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగడం కష్టమని చెప్పకనే చెప్పేశారు.
ఇక అల్లు అర్జున్ బాలీవుడ్ సినిమాలు చేయకపోయినా ఈయనకు మాత్రం నార్త్ ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి ముఖ్యంగా పుష్ప సినిమాని సౌత్ ఇండస్ట్రీ కంటే కూడా నార్త్ ఇండియన్ ప్రేక్షకుల ఎంతగానో ఆదరించారు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాకి కూడా నార్త్ ఇండియాలో ఎంతో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి మరి ఈ సినిమా అక్కడ ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో తెలియాల్సి ఉంది.
ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…
ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…
హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…