Pushpa Ott Rights: పుష్ప ఓటీటీ హక్కులకు బాడీ డీల్.. ఈ సినిమాకు ఇచ్చిన ఆఫర్ తెలిస్తే మతిపోవాల్సిందే!
Pushpa Ott Rights: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఎన్నో అనుమానాల మధ్య ఈ సినిమా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.
ముఖ్యంగా హిందీలో ఏమాత్రం మార్కెట్ లేని అల్లు అర్జున్ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టడంలో ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఈ సినిమా అన్ని భాషలలో పెద్ద మొత్తంలో కలెక్షన్లను రాబట్టి విజయాన్ని సొంతం చేసుకుంది. సాధారణంగా సినిమా థియేటర్ లో విడుదలైన తర్వాత ఆ సినిమాని
ఓటీటీలో విడుదల చేయడం సర్వసాధారణం.
ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం భారీ డీల్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమా విడుదలై మూడు వారాలు అయినప్పటికీ థియేటర్లలో పుష్ప సందడి ఏ మాత్రం తగ్గడం లేదు. ఇలా థియేటర్ రన్ అవుతున్న సమయంలోనే ఈ సినిమాని ఏకంగా ఓటీటీ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.
పుష్ప సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ఎంతో పోటీపడి మరీ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేశారు. ఈ సినిమా కేవలం తెలుగు వెర్షన్ లో డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడం కోసం 22 కోట్లు చెల్లించింది.ఇక అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా కోసం అమెజాన్ ఏకంగా 60 నుంచి 70 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించే కైవసం చేసుకున్న అమెజాన్ ఈ సినిమాని జనవరి 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే సంక్రాంతి పండుగ రావడంతో అమెజాన్ సంక్రాంతి పండుగ ను క్యాష్ చేసుకుని ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…