కరోనా మహమ్మారి విజృంభించి ఏడాది గడిచినా వైరస్ గురించి భయాందోళన ప్రజల్లో ఏ మాత్రం తగ్గలేదు. గతంలో ఏ వైరస్ వ్యాప్తి చెందని విధంగా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందడంతో పాటు ప్రజలకు కొత్త సమస్యలను సృష్టిస్తోంది. ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారికి చెక్ పెట్టే మందులు, వ్యాక్సిన్ల కోసం పరిశోధనలను కొనసాగిస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రజలకు వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే వ్యాక్సిన్ వచ్చినా రాకపోయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే ఈ వైరస్ కు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవారు కరోనా సోకితే త్వరగానే కోలుకుంటున్నా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడే వాళ్లు మాత్రం కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత కూడా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉండటం గమనార్హం.
అమెరికాకు చెందిన గీసిన్జర్ మెడికల్ కాలేజీ తాజాగా కరోనా గురించి ఒక పరిశోధన చేసి షాకింగ్ విషయాలను వెల్లడించింది. మార్చి నెల 7వ తేదీ నుంచి మే నెల 19వ తేదీ వరకు కిడ్నీ రోగులపై కరోనా ప్రభావం గురించి పరిశోధనలు చేసి కిడ్నీ వ్యాధులతో బాధ పడేవాళ్లపై కరోనా వైరస్ తీవ్రంగా ప్రబావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గీసిన్జర్ మెడికల్ కాలేజీ వైద్యులు సాధారణ రోగులతో పోల్చి చూస్తే కిడ్నీ సమస్యలతో బాధ పడే వాళ్లు 11 రెట్లు ఎక్కువగా కరోనా బారిన పడే అవకాశం ఉందని తేల్చారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో పోల్చి చూస్తే కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధ పడేవారిపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…