Featured

హెల్మెట్ లేని వారికి షాకింగ్ న్యూస్.. ఇకపై నో పెట్రోల్..?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచనలు చేసినా కొందరు మాత్రం నిబంధనలను అస్సలు పట్టించుకోవడం లేదు. నిత్యం జరుగున్న బైక్ యాక్సిడెంట్లలో హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినా వాహనదారుల్లో మార్పు రాకపోవడంతో కోల్‌కతా పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై హెల్మెట్ ధరించకపోతే బైక్ వెళ్లే వాళ్లు పెట్రోల్ ను కొనుగోలు చేయలేరు. మరో రెండు రోజుల్లో కోల్ కతా అంతటా ఈ నిర్ణయం అమలులోకి రానుంది. కోల్ కతా పోలీస్ కమిషనర్ అనూజ్ శర్మ మాట్లాడుతూ ఇప్పటికే నగరంలోని పెట్రోల్ బంకులకు హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణించే వారికి పెట్రోల్ పోయకూడదని ఆదేశాలు జారీ చేశామని.. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయని తెలిపారు.

టూ వీలర్ వాహనాలపై ప్రయాణించే వాళ్లలో బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక ఉండే వ్యక్తికి కూడా హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని అనూజ్ శర్మ వెల్లడించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం హెల్మెట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. టూ వీలర్లపై ప్రయాణించే వాళ్లు హెల్మెట్ ధరించాలని సూచనలు చేశారు.

ఎవరికైనా హెల్మెట్ కొనుగోలు చేసేంత స్థోమత లేకపోతే వారికి ప్రభుత్వమే ఉచితంగా హెల్మెట్ ఇస్తుందని మమతా బెనర్జీ వెల్లడించారు. సమీప పోలీస్ స్టేషన్ లో వివరాలు ఇచ్చి హెల్మెట్ ను పొందవచ్చని మమతా బెనర్జీ వెల్లడించారు. మాస్క్ ధరించకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించమని.. అయితే మాస్క్ ధరించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నానని మమతా బెనర్జీ అన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

30 minutes ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

37 minutes ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

44 minutes ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

51 minutes ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

1 hour ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

1 hour ago